ఇది విన్న ఆ భర్త.. భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు. కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొందరు. భర్తను తిట్టడం మొదలు పెడతారు. 'మగవాడై ఉండి. తాను నడవకుండా మహిళను నడిపిస్తున్నాడు. అసలు అతను మనిషేనా' అంటారు. దీంతో.. అసలు ఈ గొడవ అంతా ఎందుకు. ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ వెళ్తుంటారు.
మరో గ్రామానికి వెళ్లే సరికి అక్కడున్న వారు చూసి 'వీళ్లకు అసలు బుద్ధి ఉందా.? గాడిద ఉండగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటి.? ఉన్న వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్లు అంటూ' తిడుతుంటారు.
నీతి: ఈ చిన్న కథలో జీవితానికి సరిపడ సందేశం దాగి ఉంది. మనం ఏది చేసినా నాలుగు మాటలు అనే ఆ నలుగురు కచ్చితంగా ఉండే ఉంటారు. అందుకే నలుగురి మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయాలి. అయితే ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా, నీజాయితీగా ముందుకు వెళ్తే ఎవరేం అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.