ఆహారంలో మార్పు
మనలో కొంతమంది పెళ్లిళ్లు, ఫంక్షన్లు లేదా రాత్రిపూట హెవీగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్, చేపలు, మటన్ వంటి మాంసాహారం తింటుంటారు. కానీ వీటిని రాత్రిపూట అతిగా తింటే తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీకు నిద్రపట్టదు. ఒకవేళ మీరు మాంసాహారం తినాలనుకుంటే మూడు, నాలుగు గంటలకే తినండి. అప్పుడే మీకు అజీర్థి, నిద్రలేమ సమస్యలు రాదు. అలాగే ఇది మీరు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పడుకునే ముందు కొన్ని నీళ్లను తాగండి.