ఈ వసంత పంచమి రోజునే రతీదేవిని, కామదేవుడిని, వసంతుడు భక్తులచే పూజలు అందుకుంటారు. ఈ ముగ్గురిని ఒకే రోజున పూజించడం వల్ల జనాల మధ్య ప్రేమాభిమానులు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పూజ వల్ల జ్ఞానం పెరుగుతుందట. ఈ పండుగ ప్రారంభంతో వాతావరణం శోభాయమానంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులోనూ ఈ రుతువుతోనే కొత్త పంటలు వస్తాయి. అంతేకాదు పశువులకు కూడా గ్రాసం మెండుగా లభిస్తుంది.