రాఖీ కట్టడానికి ముందు కావాల్సిన వస్తువులను ఒక థాలీలో పెట్టుకోవాలి. అందులో రాఖీ, కుంకుమ, బియ్యం, దీపం, స్వీట్లు పెట్టుకోవాలి. సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోబెట్టి, ముందుగా నుదుటిపై కుంకుమ, బియ్యంతో తిలకం పెట్టాలి. ఆ తర్వాత కుడి చేతికి రాఖీ కడుతూ పై మంత్రాన్ని చెప్పాలి. రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి, స్వీట్ తినిపించి, అతడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవచ్చు. సోదరుడు కూడా తన సోదరికి తనకు చేతనైన బహుమతి ఇచ్చి ప్రేమను చూపించాలి.