పైనాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. కానీ అదే పనిగా తింటే మాత్రం మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువ అవుతుంది. దీంతో మీరు వాంతులు, గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.