నేడు ప్రతిదీ వ్యాపారం.
నిజాలు బయటకు రావు .
నిజాలు తెలుసుకోవాలంటే కాస్త ప్రయత్నం చెయ్యాలి .
గత పదేళ్లుగా టీచింగ్ వృత్తిలో ఉన్న పది మందిని కలవండి .
గ్రామీణ పాఠశాలలు .. ప్రభుత్వ పాఠశాలలు , బడ్జెట్ బడులు, సిబిఎస్సీ , ఇంటర్నేషనల్ .. ఇలా అన్ని రకాల బడుల్లో... పాఠాలు చెబుతున్న టీచర్స్ ను కలవండి.
కింద ఇచ్చిన విషయాలు నిజామా? కాదా?? అని అడగండి .
1. అధిక శాతం పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ కనిపిస్తుంది.
2. కనీసం మూడు నిముషాలు ఏకాగ్రతతో పాఠాలు వినరు. పక్క పిల్లలను డిస్టర్బ్ చేస్తారు. క్లాస్ పై ద్రుష్టి పెట్టకపోవడం వల్ల ఎంత బాగా పాఠం చెప్పినా అర్థం కాదు.
3. గ్రహణ శక్తి తగ్గి పోయింది. వరుసగా మూడు పనులు చెప్పండి. ఒకటొదే చేస్తారు. వరుసగా మూడు విషయాలు గ్రహించే స్థాయిని కూడా వారు కోల్పోయారు. ఒకప్పుడు ఏకసంతాగ్రాహులు ఉండేవారు. ఒక్కసారి చెబితే విని గుర్తు పెట్టుకొనే పవర్. ఇప్పుడు? శతావధానం. అంటే ఒకేసారి వంద మందితో వ్యవహరించే శక్తి . ఇప్పుడు ?
కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించండి .
4. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది . కారు నంబర్స్ చెబుతున్నాడని సంతోషపడకండి