చిన్న తనంలో మనకు స్నేహితులు తప్ప.. మరో ధ్యాస ఉండదు. వయసు పెరిగిన తర్వాత మన పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, జీవితం, ఒత్తిడి, కెరిర్ ఇలా రకరకాల కారణాల వల్ల స్నేహితులకు దూరమైపోతూ వస్తున్నాం. అయితే.. అందరూ అలా దూరం కాకపోవచ్చు. కొందరు ఇప్పటికీ స్నేహితులతో టచ్ లో ఉండి ఉండొచ్చు. అయితే.... కరోనా మహమ్మారి తర్వాత.. టచ్ లో ఉన్నవారు సైతం కాస్త దూరమయ్యారనేది వాస్తవం. కొందరు పూర్తిగా దూరం కాకపోయినా.. వ్యక్తిగతంగా కలుసుకోలేక వీడియోకాల్స్, మెసేజ్ లతో మాట్లాడుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.