ఒకప్పుడు మధ్య వయస్కులు, పెద్దవారిలోనే అధిక రక్తపోటు సమస్య వస్తుండేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు, యువత కూడా హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటును సకాలంలో గుర్తించకపోవడం, దానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒత్తిడికి గురికావడం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును పెంచుతాయి. కానీ ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కానీ రక్త పోటును నియంత్రించడానికి ఆహార మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి మీ ఆహారంలో చేర్చాల్సిన కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..