Health Tips : దగ్గు, జలుబుతో బాధపడితే ఈ ఆహారాలను పొరపాటున కూడా తీసుకోకండి.. ఎందుకో తెలుసా?

First Published Jan 27, 2022, 12:00 PM IST

Health Tips : చలికాలంలో జలుబు చేయడం, దగ్గుతో బాధపడటం సర్వ సాధారణ విషయం. కానీ వీటి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ ఈ జలుబు, దగ్గు కరోనా లక్షణాలలో ఒకటి. ఇలాంటి సమస్యలు అటాక్ చేస్తే అది కరోనా సోకడం వల్ల వచ్చిందా.. లేకపోతే సీజనల్ గా వచ్చినయా అని తెగ ఆలోచిస్తుంటాం. అయితే..
 

Health Tips : ఈ చలికాలంలో ఒకవైపు దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు సీజనల్ గా అటాక్ చేసే వ్యాధులు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. అంతేకాదు ఇదే సమయంలో ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. వీటికి తోడు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. కాగా ఈ లక్షణాలు సీజనల్ గా వచ్చే వ్యాధులలో కనిపిస్తాయి. అలాగే కరోనా లక్షణాలలో ఇవి కూడా ఉన్నాయి. ఈ లక్షణాలే ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని అనుమానాల్ని తీర్చేసుకోవడం ఉత్తమం. అయితే దగ్గు, జలుబులు సీజనల్ గా వస్తే మాత్రం అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. లేదంటే ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 


దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు వాటిని గుర్తుంచుకోకుండా తింటే మాత్రం ఛాతిలో శ్లేష్మం పెరిగి పోయి అది కాస్త ప్రాణాల మీదికి తీసుకెళ్లవచ్చు. సో ఆ టైం లో ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

అన్న: అన్నం ఆరోగ్యానికి మంచిదే అయినా దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్నప్పుడు తినడం మంచిది కాదు. ఎందుకంటే రైస్ Cooling effectను కలిగి ఉండటంతో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా శ్లేష్మం ఏర్పడుతుంది. సో ఆ టైం లో అన్నం తినడం మంచిది కాదు. 

పాలు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలకు దూరంగా ఉండటమే మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పాలను తాగితే ఛాతిలోని శ్లేష్మం మరింత పెరిగి.. ఈ దగ్గు, జలుబును మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నప్పుడు పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చక్కెర:  చక్కెర మన ఛాతిలో మంటను ప్రేరేపించే గుణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు చక్కెర ఇమ్యునిటీ పవర్ ను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా తుమ్ములను, దగ్గును కూడా పెంచుతుంది. అందుకే దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా షుగర్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు వీటి నుంచి త్వరగా బయటపడాలన్నా.. చక్కెరకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే ఉత్తమం.
 

ఆల్కహాల్: ఛాతిలో మంటను పుట్టించడంలో మద్యం ముందుంటుందని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందులోనూ శరీరానికి ఏదైన గాయం అయితే దాన్ని నయం చేయడానికి ఉత్పత్తయ్యే తెల్ల రక్త కణాలను ఈ ఆల్కహాల్ దెబ్బతీస్తుందట. ముఖ్యంగా ఈ ఆల్కహాల్ శరీరంలో అనేక రకాలుగా హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే  జలుబు, దగ్గు సమస్య ఉన్నప్పుడు మద్యానికి దూరంగా ఉండాలి.
 

కాఫీ:   కాఫీలో ఉండే కెఫిన్ గొంతు కండరాలు పొడిబారేలా చేస్తాయి. తద్వారా తీవ్రమైన దగ్గు బారిన పడే ప్రమాదం ఉంది. సో దగ్గు, జలుబు ఉన్నప్పుడు కెఫిన్ ఉన్న పానియాలకు దూరంగా ఉండటం బెటర్. జబులు, దగ్గు ఉన్నప్పుడు కాఫీలతో పాటుగా టీలకు కూడా దూరంగా ఉండాలి. 

click me!