దొంగ బదిలిస్తూ.. 'నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు. నగలు దొంగతనం చేసిన నన్ను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు కాసేపు నీ దుకాణంలో ఆశ్రయం కల్పిస్తే నేను దొంగలించిన బంగారాన్ని సగం సగం పంచుకుందాం. నేను దొంగలించిన మొత్తం నగల విలువ రూ. 10 లక్షలు ఉంటుంది' అని చెప్తాడు. దీంతో రాజుకు ఒక్కసారిగా అత్యాశ పుడుతుంది.
రూ. 5 లక్షలు వస్తాయన్న ఆశతో తాను చేస్తుందని తప్పనే విషయాన్ని కూడా రాజు మర్చిపోతాడు. దుకాణంలో ఓ మూలన దాక్కోమని దొంగకు సలహా ఇస్తాడు. కాసేపటికి అటుగా వచ్చిన పోలీసులు రాజును దొంగ గురించి అడిగ్గా.. స్పందిస్తూ.. 'నేను ఎవరినీ చూడలేదు. అసలు ఇటు వైపు ఎవరూ రాలేదు' అని చెప్తాడు.
పోలీసులు వెళ్లిపోగానే రాజు ఫుల్ ఖుషీ అవుతాడు. దొంగ తనకు నగలు ఇస్తాడని ఆశపడతాడు. అయితే నెమ్మదిగా బయటకు వచ్చిన దొంగ తన అసలు రూపాన్ని బయటపెడతాడు. ముందుగా చెప్పినట్లు తన వాటా నగలు ఇవ్వమని అడగ్గానే.. ఒక్కసారిగా తన సంచిలోని కత్తిని బయటకు తీసి రాజును బెదిరించడం మొదలు పెడతాడు. అరిస్తే చంపేస్తానని, గల్లా పెట్టెలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఇచ్చేయాలని బెదిరిస్తాడు.