నోబెల్ బహుమతి రాలేదు
సత్యం,శాంతి, అహింస సందేశాన్ని బోధించడానికి మహత్మాగాంధీ తన జీవితమంతా గడిపారు. నిజానికి ఈయన చాలా సైలెంట్ వ్యక్తి. కానీ ప్రజలకు ఎప్పుడూ కూడా అహింసా మార్గాన్నే చూపారు. కానీ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మా గాంధీకి ఎన్నడూ కూడా నోబెల్ శాంతి బహుమతి అందలేదు. 1937, 1938, 1939, 1947 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతికి గాంధీజీ నామినేట్ అయినా కూడా ఆయన ఎన్నడూ ఆ పురస్కారాన్ని అందుకోలేదు. అంతే కాదు గాంధీజీ హత్యకు గురైన 1948 సంవత్సరంలో కూడా నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డారు. కానీ ఆ సంవత్సరం కూడా ఆయనను నోబెల్ కమిటీ ఎంపిక చేయలేదు.