కొత్తేడాది రోజు దేశ రాజధాని ఢిల్లీ ఎన్సిఆర్లోని గ్రేటర్ నోయిడాలో రూ. 14 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు గణంకాలు చెబుతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు రూ.4 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయిందని తేలింది. డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. మద్యం విక్రయాలకు సంబంధించి ఎలాంటి ధృవీకరించిన సమచారం లేదు. అయితే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్తేడాదికి రూ. వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.