మధుమేహులు ప్రతిరోజూ కప్పు పెరుగు తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీరు బోండాలు, దోశ, ఇడ్లి వంటివి తినడం మంచిది కాదు. వీటిని తింటే అనారోగ్య సమస్యలు రావొచ్చు. బోండాల్లో మైదా, ఇడ్లి, దోశల్లో బియ్యాన్ని కలుపుతుంటారు. వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.