సెనగ పిండి, పసుపు, రోజ్ వాటర్: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల సెనగ పిండి (Gram flour), చిటికెడు పసుపు (Turmeric), కొద్దిగా రోజ్ వాటర్ (Rose water) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.