దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం తేదీ : 15 సెప్టెంబర్, 2025 (ఇవాళ్టి నుండి)
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 14 అక్టోబర్ 2025
దరఖాస్తు ఫీజు అభ్యర్థుల కేటగిరీని బట్టి మారుతుంది. ఎస్సి, ఎస్టి, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు, ఈబిసి అభ్యర్థులకు ₹250 దరఖాస్తు ఫీజు ఉంటుంది... CBT ఎగ్జామ్ తర్వాత వీరికి ఫీజు తిరిగి ఇస్తారు. ఇతరులు అంటే జనరల్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ₹500 దరఖాస్తు ఫీజు ఉంటుంది.... వీరికి CBT తర్వాత ₹400 తిరిగి ఇస్తారు.
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. అభ్యర్థులు రైల్వే నియామక బోర్డు అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు, అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని అర్హతలు మీకు ఉన్నాయని నిర్ధారించుకోండి. దరఖాస్తుకు చివరి తేదీ 14.10.2025 కాబట్టి, త్వరగా దరఖాస్తు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ కలను సాకారం చేసుకోండి.