Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్

Published : Sep 07, 2026, 09:40 PM IST

తెలుగమ్మాయిలకు బంపరాఫర్… కేవలం పదో తరగతి చదివుంటే చాలు సొంత ఊళ్లోనే ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఏపీలో ఆశా వర్కర్ జాబ్స్

Asha Worker Jobs : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆశా కార్యకర్తలుగా పనిచేయాలనుకునే మహిళలకు ఇదే మంచి అవకాశం... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తాజా నియామకాల ప్రక్రియ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తల పోస్టులన్నీ భర్తీ చేసినట్లవుతుందని మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, కుటుంబ సంక్షేమం, టీకాలు, ఆరోగ్య అవగాహన వంటి అంశాల్లో వారు ప్రజలకు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి Zero Vacancy (జీరో వేకెన్సీ) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,294 ఆశా పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాజాగా మరో 913 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో మొత్తం 2,207 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లవుతుంది.

24
సెప్టెంబర్ 30లోగా నియామక ప్రక్రియ పూర్తి

తాజాగా భర్తీ చేయనున్న 913 పోస్టుల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 673 పోస్టులు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 64, పట్టణ ప్రాంతాల్లో 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే డిస్ట్రిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అర్హులుగా పరిగణించనున్నారు.

ఆశా వర్కర్ నియామకాలకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 30వ తేదీలోగా నియామకాల జాబితాను పంపించాలని జిల్లాలను ఆదేశించినట్లు వెల్లడించారు.

34
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

తాజాగా భర్తీ చేయనున్న ఆశా కార్యకర్తల పోస్టులు వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యను పరిశీలిస్తే.. అనకాపల్లిలో అత్యధికంగా 77 పోస్టులు, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమగోదావరిలో 42 పోస్టులు ఉన్నాయి. అలాగే అన్నమయ్య జిల్లాలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక

అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.

44
శాలరీ ఎంత?

ఆశా కార్యకర్తలకు ప్రస్తుతం నెలకు రూ.10,000 చొప్పున వేతనం అందుతోంది. ఇందులో రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు ప్రతి ఏడాది వేతనాల కోసం సుమారు రూ.513 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.426.84 కోట్ల వరకు భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది.

కొత్తగా 913 పోస్టుల భర్తీతో రాష్ట్రంలోని ఆరోగ్య సేవలను మరింత విస్తరించడంతో పాటు గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories