భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, అంతరిక్షంలో ఆసక్తికర ప్రయోగం చేశారు. ధార్వాడ్ శాస్త్రవేత్తల సూచనలతో, మెంతులు, నామ్ విత్తనాలు మొలకెత్తే ప్రక్రియను అంతరిక్షంలో పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా గురుత్వాకర్షణ లేని వాతావరణంలో విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? అనే అంశంపై విశ్లేషణ జరిగింది.
ఈ ప్రయోగాన్ని ధార్వాడ్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన రవికుమార్ హోసమణి, IIT ధార్వాడ్కు చెందిన సుధీర్ సిద్ధాపూర్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారు. ప్రయోగం తర్వాత మొలకెత్తిన విత్తనాలను భూమికి తీసుకొచ్చి, పునరుద్ధరణ జరిపే ఆలోచన చేస్తున్నారు.