బ్రహ్మోస్ ఒప్పందం కేవలం క్షిపణుల సరఫరాతో ముగియదు. తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్ వ్యవస్థలు, సైనిక శిక్షణ, నిర్వహణ సేవలు, సాంకేతిక సహాయం వంటి అంశాలను కూడా ఇందులో భాగంగా అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేసియా తన తీర భద్రతను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.
అలాగే ఇండోనేసియాలోని కీలక ఖనిజాల రంగంలో కూడా భారత్ పెట్టుబడులు పెట్టనుంది. ముఖ్యంగా స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సబాంగ్ పోర్టు అభివృద్ధిలో కూడా భారత్ భాగస్వామ్యం కానుంది. అదనంగా, ఇండోనేసియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీలో సాంకేతిక సహాయం అందించేందుకు కూడా అంగీకారం కుదిరింది.