Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు

Published : Jul 02, 2026, 04:49 PM IST

Viral News: ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స‌మ‌యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల‌భ్య‌మైన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. 

PREV
15
సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతోంది?

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఇరాక్‌కు చెందిన మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం సాగింది. ఈ దాడిలో సుమారు 57 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, 27 కిలోల బంగారం, అలాగే బంగారంతో తయారుచేసిన విలాసవంతమైన లోదుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వాదనలకు మద్ధతుగా కొన్ని ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

25
దర్యాప్తులో బయటపడిన వాస్తవం

ఈ వైరల్ ప్రచారాన్ని పరిశీలించిన తర్వాత, అందులో పేర్కొన్న అంశాలకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైంది. ముఖ్యంగా హింద్ అల్-అబ్బాసి ఇంట్లో బంగారు లోదుస్తులు లేదా 57 మిలియన్ డాలర్ల నగదు దొరికిందని ఇరాక్ ప్రభుత్వం, భద్రతా సంస్థలు లేదా అధికారిక మీడియా ఎక్కడా ప్రకటించలేదు.

35
అసలు సోదాలు ఎవరిపై జరిగాయి?

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాక్ అవినీతి నిరోధక దర్యాప్తులో భాగంగా అధికారులు నిర్వహించిన దాడులు మాజీ ఎంపీ అలియా నాసిఫ్కు సంబంధించిన వ్య‌వ‌హారం చుట్టూ తిరిగాయి. ఈ సోదాల్లో సుమారు 15.5 మిలియన్ డాలర్ల నగదుతో పాటు గణనీయమైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వ‌చ్చాయి. అదే కేసులో ఆమె కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో హింద్ అల్-అబ్బాసి పేరుతో ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు.

45
ఇరాక్‌లో అవినీతిపై కొనసాగుతున్న కఠిన చర్యలు

ఇటీవలి కాలంలో ఇరాక్ ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది. మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులపై విచారణ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన మాజీ డిప్యూటీ చమురు శాఖ మంత్రి ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను విచారించినట్లు సమాచారం.

55
వైరల్ పోస్టులను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి

సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే ప్రతి సమాచారం నిజం కావాల్సిన అవసరం లేదు. ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక సోదాలు జరిగిన విషయం నిజమే అయినప్పటికీ, 27 కిలోల బంగారం, బంగారు లోదుస్తులు, 57 మిలియన్ డాలర్ల నగదు వంటి సంచలనాత్మక వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ఇలాంటి వార్తలను నమ్మే ముందు విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రకటనలను పరిశీలించడం అవసరం. ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనంలోని కీలక ఆరోపణలు నిర్ధారణ కాలేదని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories