మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి.. !

First Published May 4, 2021, 1:03 PM IST

మెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫ్లైఓవర్ కూలిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది.

మెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫ్లైఓవర్ కూలిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది.
undefined
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 49 మంది గాయపడ్డారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
undefined
ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ మెట్రో రైల్ వెళ్తుండగా బ్రిడ్జి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
undefined
రాత్రి 10:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
undefined
అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టలేకపోయామని అధికారులు తెలిపారు.
undefined
కారణం దీనివల్ల వేల్లాడుతున్న రైలు భోగీలు కిందికి పడి ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే సహాయక చర్యలు ప్రారంభించారు.6
undefined
ప్రమాదం జరిగిన ట్రెయిన్ బాగా దెబ్బతినడం వల్లే సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ అన్నారు.
undefined
కూలిపోయిన ఓవర్‌పాస్‌పై నడిచే మెట్రో 12 లైన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం నిర్మించిందని.. ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ మెక్సికో నగర మేయర్‌గా ఉన్నప్పుడు ఈ నిర్మాణం జరిగింది.
undefined
click me!