27 లక్షల చదరపు అడుగుల్లో భారత్ మార్ట్:
భారత్ మార్ట్ 27 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశ 13 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇది భారతదేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) ప్రధాన వ్యాపార కేంద్రంగా పనిచేస్తుంది. భారత్ మార్ట్లో 1500 షోరూమ్లు ఉంటాయి. ఇక్కడ 7 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో అత్యాధునిక గిడ్డంగిలు, చిన్న పరిశ్రమ యూనిట్లు, ఆఫీసులు, మీటింగ్ రూములు ఉంటాయి. మహిళలు నడిపే వ్యాపారాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు.
భారత్ మార్ట్ జెబెల్ అలీ పోర్టు నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఇతిహాద్ రైలుకు కూడా సులువుగా వెళ్లొచ్చు. భారత్ మార్ట్లో భారతీయ వ్యాపారాలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.