HCU: హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు నిజం కాదా.? ప్రభుత్వానికి ఇదే ఆయుధంగా మారనుందా?

Published : Apr 02, 2025, 02:20 PM IST

కంచ గచ్చిబౌలి భూవివాదం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలను కొనసాగుతున్నాయి. క్యాంపస్‌కు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం చూస్తోంది విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   

PREV
12
HCU: హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు నిజం కాదా.? ప్రభుత్వానికి ఇదే ఆయుధంగా మారనుందా?
HCU Lands

సధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివేనని తీర్పు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీజీఐఐసీకి భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భూములను చదును చేయించేందుకు భారీ ఎత్తున జేసీబీలను తీసుకొచ్చారు. 

అర్థరాత్రి సమయంలో జేసీబీలతో భూమిని చదును చేయిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నిజానికి ఈ వీడియో తర్వాత ఈ అంశం మరింత వైరల్‌ అయ్యింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని దెబ్బతిస్తోందని, పచ్చటి చెట్లను నరికివేస్తోందని ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 
 

22

అయితే ఇదే సమయంలో హెచ్‌సీయు వివాదానికి సంబంధించి ఓ డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ భూమి వివాదంలో సహజ సిద్ధమైన చెట్లు, కొన్ని వన్యప్రాణాలు నష్టపోతున్నాయని చెప్పడంలో నిజం ఉంది. అయితే గుంపులు గుంపులుగా జింక లు .. నెమళ్ళు హాహాకారాలు చేస్తున్నట్టు, బుల్ డోజర్ శబ్దాలు అన్నీ … కృత్రిమ మేధ డీప్ ఫేక్.  
సమస్య ను సమస్యగా మాట్లాడితే ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. డీప్ ఫేక్ కృత్రిమ మేధ ఫోటో లు వీడియో లు సర్క్యూలేట్ చేస్తే ప్రభుత్వానికి ఆయుధం ఇచ్చి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 

సోర్స్‌: అర్‌నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌ పోస్ట్‌. 

Read more Photos on
click me!

Recommended Stories