మానవ శరీరంలోకి ప్రమాదకర కెమికల్స్ ఎలా చేరుతున్నాయి :
PFAS అని పిలువబడే పెర్- ఆండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్థాలు చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇవి నీరు, వేడి, నూనెల, గ్రీజు వంటి పదార్థాలకు నిరోధకంగా పనిచేస్తాయి. అంటే వీటివల్ల ప్రభావితం కాకుండా వుండే సింథటిక్ రసాయనాల సమూహం అన్నమాట. అందువల్లే ఈ రసాయనాలను మనుషులు నిత్యం ఉపయోగించే వస్తువుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆహార ప్యాకేజింగ్, కుక్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు,అగ్నిమాపక, కార్పెంటింగ్, మెటల్ ప్లేటింగ్, ఫోటో ఇమేజింగ్, సెమీ కండక్టర్ వంటివాటిలో PFAS కెమికల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌందర్య సాధనాలు, శీతలకరణ, పురుగుమందులు వంటి ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. ఇలా ఇప్పుడు కాదు 1950 నుండే పారిశ్రామిక ఉత్పత్తుల్లోనే కాదు సామాన్య మానవులు కూడా ఈ ప్రమాదకర కెమికల్స్ ను వాడుతున్నారు. దీని వాడకం క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు మరింత ప్రమాదకర స్థాయికి చేరింది.
ఈ కెమికల్ నీరు, గాలి, వేడికికి ప్రభావితం కాదు... అందువల్ల వాతావరణంలో చాలాకాలం అలాగే వుండిపోతుంది. అందువల్లే వీటిని "ఫరెవర్ కెమికల్స్" అనికూడా పిలుస్తుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ PFAS కెమికల్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
ఇవి పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి అహారపదార్థాలతో పాటు తాగునీటిని కూడా కలుషితం చేస్తున్నాయి. వీటిద్వారా మన శరీరంలోకి ఈ ప్రమాదకర కెమికల్స్ చేరిపోతున్నాయి. ఇటీవల కాలంలో మనిషి రక్త నమూనాల్లో కూడా ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చివరకు తల్లి ద్వారా కడుపులోని పిండానికి, తల్లిపాల ద్వారా పిల్లలకు కూడా విషం చేరుతోంది.