2.జలుబు దగ్గుకు పసుపు నీరు
నిరంతర దగ్గు తో బాధపడేవారు పసుపు నీటితో దీనికి చెక్ పెట్టొచ్చు. పసుపు నీటిని నోటితో పుక్కిలించి ఊయడం వల్ల మీరు జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపొచ్చు. చేదు ఆధునిక ఔషధాన్ని ఉపయోగించి పుక్కిలించలేని పిల్లలకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
పసుపు నీరు గార్గల్ మిశ్రమం కోసం కావలసినవి
పసుపు 1 టీస్పూన్
1 గ్లాసు నీరు
ముందుగా నీళ్లను మరిగించి అందులో పసుపు వేయాలి.
మిశ్రమాన్ని 3-5 నిమిషాలు మంట మీద ఉంచండి, తద్వారా పసుపు పూర్తిగా కరిగిపోతుంది.ఈ మిశ్రమాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఇలా చేయవచ్చు. అలా చేయడం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది.