కరోనా సోకిన తర్వాత ఈ తప్పులు చేస్తే.. ప్రాణానికే ముప్పు..!

First Published May 18, 2021, 10:26 AM IST

ముందుగానే పరీక్ష చేయించుకోవడం వల్ల చికిత్స కూడా ముందుగానే అందించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆలస్యం చేయడం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
 

కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అయితే.. చాలా మందిలో కరోనా పాజిటివ్ వచ్చిన మొదట్లో స్వల్ప లక్షణాలు ఉన్నా.. ఆ తర్వాత ఆ లక్షణాలు తీవ్రతరమౌతున్నాయట. తగ్గిపోయిందిలే అనుకునేలోపు... ఏదో ఒక సమస్య వచ్చి ప్రాణాలు పోతున్నారట. దానికి తెలిసీ తెలియక మనం చేసే కొన్ని పొరపాట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటి..? వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
undefined
కరోనా లక్షణాలు ఏంటేంటో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ... స్వల్ప లక్షణాలు ఉన్నవారు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే.. లక్షణాలు కొద్దిగా కనిపించగానే వెంటనే జాగ్రత్తపడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు కొద్దిగా ఉన్నంత మాత్రాన.. ఏమీ కాదు అని ధీమాగా ఉండకూదడు. వెంటనే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలి.
undefined
కోవిడ్ లక్షణాలు కనపడగానే.. చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined
కరోనా పాజిటివ్ రాగానే.. దాని గురించి ముందుగా అవగాహన చేసుకోవాలి. అలా చేయకపోతే.. మీ ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. లక్షణాలు స్వల్పంగా ఉన్పప్పటికీ.. మనం రిస్క్ లోనే ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి. కోవిడ్ లక్షణాలతోపాటు.. ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే.. ముందుగానే పరీక్ష చేయించుకోవాలి.
undefined
దీనిని ముందుగా గుర్తించడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందకుండా కాపాడగలిగే అవకాశం ఉంటుంది. చాలా మంది అదే తగ్గిపోతుందిలే అని.. పరీక్ష కూడా చేయించుకోవడం లేదు. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ.. వైద్యుల సలహా తీసుకోవాలి.
undefined
చాలా మంది కరోనా పాజిటివ్ రాగానే స్టెరాయిడ్స్ వాడాలి అనే భ్రమలో ఉండిపోతున్నారు. ఈ విషయంలో అందరూ క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే.. పాజిటివ్ వచ్చిన వారందరూ స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. కేవలం.. సీరియస్ గా ఉన్నవారికి మాత్రమే వాటిని ఇస్తారు. అది కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే వాటిని తీసుకోవాలనే విషయాన్ని గుర్తించాలి. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
undefined
చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హోం ఐసోలేషన్ లో ఉండిపోతున్నారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అయితే.. మీ పరిస్థితిని తెలియజేస్తూ.. వైద్యులతో ఆన్ లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకోకుండా చాలా మంది తప్పులు చేస్తున్నారు. తోచిన మెడిసిన్స్ వాడుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు.. ఎక్కువున్నా.. తక్కువున్నా.. వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని చెబుతున్నారు.
undefined
చాలా మంది లక్షణాలు కనపడిన వెంటనే పరీక్ష చేయించుకోవడం లేదు. దీని వల్ల తీవ్రత పెరిగి ఇబ్బందిపడేవారు పెరిగిపోయారట. ముందుగానే పరీక్ష చేయించుకోవడం వల్ల చికిత్స కూడా ముందుగానే అందించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆలస్యం చేయడం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
undefined
చాలా మంది పాజిటివ్ వచ్చిన తర్వాత.. మెడిసిన్స్ వేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కరెక్టే కానీ.. తరచూ జ్వరం ఎంత ఉంది.. ఆక్సీజన్ లెవల్స్ ఎంత ఉన్నాయి.. లాంటి విషయాలపై ఫోకస్ పెట్టడం లేదు.
undefined
అవి తరచూ చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆక్సీమీటర్ లో ఆక్సీజన్ లెవల్స్ 92 కన్నా తగ్గకుండా చూసుకోవాలి. తగ్గినట్లుగా అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేసుకోవడం తప్పనిసరి.
undefined
కరోనా లక్షణాలు కనపడగానే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ముందే.. ఐసోలేట్ అయిపోవాలి. ఆ తర్వాత వైద్యులను సంప్రదించాలి. కరోనా టెస్ట్ రిజల్ట్ రావడానికి 24గంటలు పడుతోంది కదా.. అని వైద్యులను సంప్రదించడం ఆలస్యం చేయకూడదు. ఈ తప్పులు చేయకుంటే.. కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంది.
undefined
click me!