సమతుల్య ఆహారం
తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తప్పకుండా తినండి. మామిడి, దోసకాయలు, బచ్చలికూర, ఇతర కూరగాయలు వంటి సీజనల్ కూరగాయలను, పండ్లను తినండి. ఇవి వర్షాకాలం రోగాల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే వీటిని తినండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం వంటి ఆహారాలను కూడా మీ ఆహారంలో చేర్చండి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగుంటాయి.