మోసాంబిలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జ్యూస్ ను సీజన్లతో సంబంధం లేకుండా తాగొచ్చు. ఈ పండ్లు ఏడాది పొడవునా మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటి పండు జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అసలు ఈ జ్యూస్ ను తాగితే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..