పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం..
వాము వాటర్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది వ్యక్తిని బట్టి మారవచ్చు.
జలుబు ,దగ్గు తగ్గిస్తుంది..
వాము నీటిని తాగడం వల్ల నాసికా రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం నుండి శ్లేష్మం తొలగించేలా చేస్తుంది. జలుబు, దగ్గు, ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ వాము నీరు తాగడం చాలా అవసరం.
వాము నీరు ఎలా తయారు చేయాలి?
ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వాము గింజలు వేసి దాదాపు 10 నిమిషాలపాటు మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడపోసి.. గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగితే సరిపోతుంది.