ఎండాకాలంలో ఫ్యాన్లు వేసినా, ఏసీ ఆన్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అందుకే శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలా మంది మజ్జిగ, పుచ్చకాయ, పండ్ల జ్యూస్ లు అంటూ ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. ఇవి వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. ఈ కాలంలో మన ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇది మన ప్రాణాలను కూడా తీసేయగలదు. అందుకే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి నీళ్లను ఎక్కువగా తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటి ఆహారాలను కూడా తినాలి. ఇవి మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అయితే కొన్ని ఆహారాలు మాత్రం శరీరంలో మరింత వేడిని పెంచుతాయి. అందుకే వీటిని ఎండాకాలంలో అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.