ఆ విషయాన్ని స్వామీజీకి తెలపగా ఆయన మాట్లాడుతూ.. “నీ ఓపిక వల్లే ఇది సాధ్యమైంది. నీకు కనిపించని రోజులలో విత్తనం భూమి లోపల చీకటిని, వేడిని తట్టుకుంది. సమయం వచ్చే సరికి బయటకు వచ్చింది. నువ్వు కూడా ఇప్పుడు కష్టాలను ఎదుర్కునే దశలో ఉన్నావు. కాబట్టి ఓపికతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే.. కచ్చితంగా విజయం సాధిస్తావు” అని చెప్తాడు. దీంతో రవికి అసలు విషయం అర్థమవుతుంది.
గొప్ప నీతి
ఫలితం ఆలస్యంగా వచ్చినా, శ్రమ వృథా కాదు. ఓపిక ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. చిన్న మొక్కలా మన ప్రయత్నాలు కూడా మొదట కనిపించకపోయినా, లోపల పెరుగుతూనే ఉంటాయి అనే గొప్ప నీతిని ఈ కథ అందిస్తోంది.