ఒకే ఒక తెలివైన ప్రశ్న...
రాజ దర్బార్ లో అందరూ రెడీగా ఉంటారు. అప్పుడే గోపాల్ అక్కడికి వస్తాడు. రాము అతనిని పలకరిస్తాడు. తాను చాలా గొప్ప విద్వాంసుడిని, పండితుడు, జ్ఞానవంతుడిని అని పరిచయం చేసుకుంటాడు. కానీ, గోపాల్ మాత్రం తనను తాను సాధారణ వ్యక్తిగా పరిచయం చేసుకుంటాడు. ‘ నిజమైన తెలివైన వంతుడు ఇంత మౌనంగా ఉండడు’ అని రాము మనసులోనే అనుకుంటాడు.
ఇక తర్వాత... అందరి ముందు.. గోపాల్ ని రాము ప్రశ్నలు అడగడం మొదలుపెడతాడు. ‘ నేను నిన్ను పరీక్షించాలి అనుకుంటున్నాను.. నిన్ను 100 ఈజీ ప్రశ్నలు అడగమంటావా? లేక ఒక కష్టమైన ప్రశ్న అడగమంటావా’ అని అడుగుతాడు. అందుకు గోపాల్ వినయంగా.... ఈజీ ప్రశ్నలు ఎందుకండి.. కష్టమైన ఒకే ఒక్క ప్రశ్న అడగండి అని అంటాడు. అందుకు రాము గర్వంగా నవ్వుకుంటూ.. ‘ కోడి ముందా గుడ్డు ముందా?’ అని అడుగుతాడు. అయితే... గోపాల్ ఏ మాత్రం కంగారు పడకుండా... కోడి ముందు అని సమాధానం ఇస్తాడు. వెంటనే రాము.. ‘అది నువ్వు ఎలా చెప్పగలవు? దానికి ఆధారం ఏంటి’ అని అడుగుతాడు. అయితే.. గోపాల్ మాత్రం... ‘ మీరు ఒక్క ప్రశ్నే అడుగుతాను అన్నారు కదా? మీరు అడిగారు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు రెండో ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటాడు. ఆ మాటకు రాము ఖంగు తింటాడు. మరో ప్రశ్న అడిగే ఛాన్స్ కూడా లేకుండా చేసిన గోపాల్ తెలివిని అందరూ ప్రశ్నించారు. అందుకే.. అందరి కంటే తామే తెలివైన వారం అనే గర్వానికి పోకూడదు అని రాము కూడా తర్వాత ఫీల్ అవుతాడు.
కథలో నీతి...
నిజమైన తెలివితేటలు మాటల్లో కాదు.. ఆలోచనలో ఉంటాయి. వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు.