
మీరు తక్కువ టైంలో సూపర్బ్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ప్రసిద్ధ శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి 'స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం' (Spiritual Telangana With Srisailam) పేరుతో ఒక అదిరిపోయే ప్యాకేజీ ఐఆర్సీటీసీ టూర్ ప్లాన్ అందుబాటులో ఉంది.
ఈ ప్యాకేజీ కోడ్ వచ్చేసి SHH004. ఇది 3 రాత్రులు, 4 రోజుల రోడ్ టూర్ ప్యాకేజీ. శుక్రవారం తప్ప వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, కంఫర్ట్ అనే రెండు క్లాసులు ఉన్నాయి. మొత్తం కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ ట్రిప్ మొత్తం 4 రోజుల పాటు సాగుతుంది. రోజువారీ షెడ్యూల్ గమనిస్తే..
ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే ప్రయాణికుల సంఖ్య, హోటల్ క్లాస్పై ఆధారపడి ఉంటాయి. మీరు ఒకరి నుండి ముగ్గురు ప్రయాణికులతో కలిసి వెళ్లాలనుకుంటే.. స్టాండర్డ్ క్లాస్లో డబుల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 21,280, ట్రిపుల్ షేరింగ్కు రూ. 15,430 గా ఉంది. అదే కంఫర్ట్ క్లాస్లో అయితే డబుల్ షేరింగ్కు రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్కు రూ. 18,400 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే.. స్టాండర్డ్ క్లాస్లో అదనపు బెడ్తో రూ. 9,690, బెడ్ లేకుండా రూ. 7,840 అవుతుంది. కంఫర్ట్ క్లాస్లో అయితే బెడ్తో రూ. 12,290, బెడ్ లేకుండా రూ. 9,690 గా నిర్ణయించారు.
ఒకవేళ మీరు 4 నుండి 6 మంది ప్యాసింజర్లతో కూడిన గ్రూప్గా వెళ్తే ధరలు కాస్త తగ్గుతాయి. ఈ గ్రూప్ సైజ్ కోసం స్టాండర్డ్ క్లాస్లో డబుల్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ. 15,260 కాగా, ట్రిపుల్ షేరింగ్కు రూ. 12,510 గా ఉంది. కంఫర్ట్ క్లాస్ విషయానికి వస్తే డబుల్ షేరింగ్కు రూ. 18,420, ట్రిపుల్ షేరింగ్కు రూ. 15,480 గా రేట్లు ఉన్నాయి. ఈ 4-6 మంది గ్రూప్లో 5 నుండి 11 ఏళ్ల పిల్లలు ఉన్నట్లయితే.. స్టాండర్డ్ క్లాస్లో బెడ్తో రూ. 9,410, బెడ్ లేకుండా రూ. 7,550 అవుతుంది. అలాగే కంఫర్ట్ క్లాస్లో పిల్లల కోసం బెడ్తో రూ. 12,010, బెడ్ లేకుండా రూ. 9,410 గా ఐఆర్సీటీసీ ఖరారు చేసింది. ఒకవేళ మీ గ్రూప్లో 7 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం స్పెషల్ రేట్ల కోసం నేరుగా వారి ఆఫీసును సంప్రదించాల్సి ఉంటుంది.
ప్యాకేజీలో కలిపి ఉన్నవి
మీరు సొంతంగా పెట్టుకోవాల్సిన ఖర్చులు ఏమిటి?
ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే డిడక్షన్స్ ఉంటాయి. ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల కంటే ముందుగా క్యాన్సిల్ చేస్తే ఒక్కో ప్యాసింజర్కు రూ. 250 కట్ అవుతుంది. 8 నుండి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్లో 25% కట్ అవుతుంది. 4 నుండి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్లో 50% కట్ అవుతుంది. 4 రోజుల కంటే తక్కువ టైంలో క్యాన్సిల్ చేస్తే 100% అమౌంట్ కట్ అవుతుంది.
హోటల్ కేటగిరీ వివరాలు గమనిస్తే.. స్టాండర్డ్ క్లాస్ లో హైదరాబాద్లో కినారా గ్రాండ్ లేదా రాజ్ ఇన్నర్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ లో రాయల్ రేవ్, ఇన్నర్ సర్కిల్, గ్రాండ్ కాంటినెంట్, హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు.
హోటల్ చెక్-ఇన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలు. ఎర్లీ చెక్-ఇన్ అనేది రూమ్స్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. పర్యాటకులు తప్పనిసరిగా ఒరిజినల్ వాలిడ్ ఐడీ కార్డ్ వెంట ఉంచుకోవాలి. దర్శనీయ స్థలాల ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ బట్టే విజిట్ ఉంటుంది. మొదటి, చివరి రోజు సందర్శన మీ అరైవల్, డిపార్చర్ టైమింగ్స్ మీద డిపెండ్ అవుతుంది.
75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణిస్తుంటే కచ్చితంగా వయసు తక్కువ ఉన్న ఫ్యామిలీ మెంబర్ తోడుండాలి. పిల్లల (2 నుండి 11 ఏళ్లు) వయస్సు నిరూపించే గుర్తింపు పత్రాలు తప్పనిసరి. 11 ఏళ్లు దాటితే అడల్ట్ ప్రైస్ పడుతుంది. బుకింగ్ చేసుకునే ముందు ఒకసారి హోటల్ వెబ్సైట్లు, రివ్యూలు చూసుకోవాలని ఐఆర్సీటీసీ కోరుతోంది.