హిందూ, ముస్లిం, క్రిస్టియన్... అన్ని మతాల్లోనూ శవాన్ని పాడెపైనే ఊరేగిస్తారు... దాన్ని నలుగురు మోస్తుంటారు. దీని వెనుక భౌతిక, సామాజిక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సైంటిఫిక్ రీజన్ (Physics & Balance)
పాడె అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఒక నిర్మాణం... దానికి నాలుగు మూలలు ఉంటాయి. శవం బరువు సమానంగా పంపిణీ జరిగి, నడిచేటప్పుడు దేహం వంగిపోకుండా లేదా కిందపడకుండా స్థిరంగా (Stable) ఉండటానికి నలుగురు మోయడం సాంకేతికంగా సరైన పద్ధతి.
సామాజిక కారణం
జీవితాంతం మనం "నలుగురితో మంచిగా బతకాలి", "నలుగురిలో గౌరవంగా ఉండాలి" అని అంటుంటాం. ఇక్కడ "నలుగురు" అంటే సమాజం. మనిషి చివరి ప్రయాణంలో ఆ సమాజమే (నలుగురు వ్యక్తులే) తోడుగా నిలిచి సాగనంపుతోందనడానికి ఇది ప్రతీక.
ఆద్యాత్మిక కారణాలు
ఆధ్యాత్మికంగా ఇది జీవితంలోని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సూచిస్తుంది. మనిషి ఈ నాలుగింటినీ పూర్తి చేసుకుని చివరి గమ్యానికి చేరుకున్నాడని దీని భావం. అలాగే మానవ జీవితంలోని నాలుగు దశలైన బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ముగిశాయనడానికి కూడా ఇది సంకేతం.
విశ్వంలోని నాలుగు దిక్కులను (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణం) గౌరవిస్తూ, ఈ భౌతిక శరీరం శూన్యంలోకి కలిసిపోతోందని సూచించడానికి కూడా పాడెను నలుగురు మోస్తారు. ఇలా అంత్యక్రియల్లో నలుగురే పాడె మోయడం వెనక ఆసక్తికర కారణాలున్నాయి.