Funeral : అంత్యక్రియల్లో శవాన్ని పాడెపైనే ఎందుకు ఉంచుతారు? నలుగురే ఎందుకు మోస్తారు?

Published : Aug 27, 2026, 01:15 PM IST

అపర కుభేరులనైనా, కూటికి దిక్కులేని పేదలనైనా చనిపోయాక పాడెపైనే మోసేది. మరి శవాన్ని పాడెపై ఉంచడం వెనకున్న కారణాలేంటి? దీన్ని నలుగురే ఎందుకు మోస్తారు? అనేది తెలుసుకుందాం.

PREV
13
అంత్యక్రియల గురించి ఆసక్తికర విషయాలు

మనిషి జీవితంలో బంధాలు, అనుంబంధాలు చాలా ముఖ్యమైనవి... ఇవే లేకపోతే మనిషికి, రోబోకి తేడా ఉండదు. అందుకే బ్రతికుండగానే నలుగురిని సంపాదించుకోవాలని పెద్దలు చెబుతుంటారు... ఇంకా ఘాటుగా ''చనిపోయాక పాడె మోసేందుకైనా ఓ నలుగురు కావాలిగా'' అని జీవిత సత్యాన్ని చెబుతుంటారు. సమాజంతో మంచి సత్సంబంధాలు కలిగివుండాలని, మంచి పేరు సంపాదించుకోవాలనే అంతరార్థం పెద్దల మాటల్లో దాగుంది.

అయితే చనిపోయిన మనిషిని పాడెపై ఊరేగించడం, నలుగురే పాడెను మోయడం వెనక సామాజిక అంశాలే కాదు కొన్ని ఆద్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. అంత్యక్రియల్లో నిర్వహించే ఈ ఆచారాల గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

23
శవాన్ని మోసేందుకు పాడే ఎందుకు?

ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత చితిలో కాల్చేవరకు లేదా సమాధి చేసేవరకు పాడె పైనే ఉంచుతారు. బలమైన కట్టెలతో ఈ పాడెను తయారుచేస్తారు... అంతిమయాత్ర కూడా ఈ పాడెపైనే జరుగుతుంది. మొత్తంగా శవాన్ని భూమిని తాకనివ్వకుండా ఈ పాడెను ఉపయోగిస్తారు. దీని వెనక ఆసక్తికర కారణాలు దాగున్నాయి.

మరణం అంటే శరీరం పంచభూతాల్లో కలవడానికి సిద్దమయినట్లు. అందుకే చివరి క్షణాల్లో ఆ దేహానికి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తారు... అందుకే నేరుగా నేలపై ఉంచకుండా పాడెపై పెడతారు. అంతేకాదు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది... కాబట్టి చనిపోయిన శవాన్ని భూమిపై పెడితే దేహంలో మిగిలిన సూక్ష్మ శక్తిని కూడా అది లాగేసుకుంటుందని చెబుతారు. అందుకే శవాన్ని భూమిపై కాకుండా పాడెపై పడుకోబెడతారు.

శవాన్ని నేలపై పెడితే క్రిములు, చీమలు, పురుగులు వంటివి చుట్టూ చేరి పాడుచేస్తాయి. దీంతో శవం మరింత త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నేలలోని తేమ కూడా శరీరాన్ని తొందరగా పాడుచేస్తుంది. అందుకే శవాన్ని పాడెపై పడుకోబెడతారు.

33
పాడెను నలుగురే ఎందుకు మోస్తారు?

హిందూ, ముస్లిం, క్రిస్టియన్... అన్ని మతాల్లోనూ శవాన్ని పాడెపైనే ఊరేగిస్తారు... దాన్ని నలుగురు మోస్తుంటారు. దీని వెనుక భౌతిక, సామాజిక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

సైంటిఫిక్ రీజన్ (Physics & Balance)

పాడె అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఒక నిర్మాణం... దానికి నాలుగు మూలలు ఉంటాయి. శవం బరువు సమానంగా పంపిణీ జరిగి, నడిచేటప్పుడు దేహం వంగిపోకుండా లేదా కిందపడకుండా స్థిరంగా (Stable) ఉండటానికి నలుగురు మోయడం సాంకేతికంగా సరైన పద్ధతి.

సామాజిక కారణం

జీవితాంతం మనం "నలుగురితో మంచిగా బతకాలి", "నలుగురిలో గౌరవంగా ఉండాలి" అని అంటుంటాం. ఇక్కడ "నలుగురు" అంటే సమాజం. మనిషి చివరి ప్రయాణంలో ఆ సమాజమే (నలుగురు వ్యక్తులే) తోడుగా నిలిచి సాగనంపుతోందనడానికి ఇది ప్రతీక.

ఆద్యాత్మిక కారణాలు

ఆధ్యాత్మికంగా ఇది జీవితంలోని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సూచిస్తుంది. మనిషి ఈ నాలుగింటినీ పూర్తి చేసుకుని చివరి గమ్యానికి చేరుకున్నాడని దీని భావం. అలాగే మానవ జీవితంలోని నాలుగు దశలైన బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ముగిశాయనడానికి కూడా ఇది సంకేతం.

విశ్వంలోని నాలుగు దిక్కులను (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణం) గౌరవిస్తూ, ఈ భౌతిక శరీరం శూన్యంలోకి కలిసిపోతోందని సూచించడానికి కూడా పాడెను నలుగురు మోస్తారు. ఇలా అంత్యక్రియల్లో నలుగురే పాడె మోయడం వెనక ఆసక్తికర కారణాలున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories