పూర్వకాలంలో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో వితంతువులపై ఎన్నో కఠినమైన నియమాలు ఉండేవి. వితంతువులు తెల్ల రంగు చీరలే కట్టుకోవాలని, పూలు పెట్టుకోకూడదని, ఆభరణాలు ధరించకూడదని, బొట్టు పెట్టుకోకూడదని, తలపై జుట్టు కూడా ఉండకూడదు అని నియమాలు పెట్టేవారు. దీనివల్ల ప్రతినెలా వితంతువులు గుండు చేయించుకోవాల్సి వచ్చేది. ఇది వారికి ఇష్టం లేకపోయినా సమాజం విధించిన కట్టుబాట్లను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటే వీధికో సెలూన్ ఉంది. అప్పట్లో మాత్రం మంగలి వీధి వీధి తిరుగుతూ అవసరమైన వారికి గుండు చేసేవాడు.