Motivational Story: ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా ఫాలో అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ కథ చదివేయండి..!

Published : Nov 06, 2025, 05:09 PM IST

Motivational Story: మనలో చాలా మందికి ఇతరులు చెప్పిన మాటలు వినే అలవాటు ఉంటుంది. అది మంచిదా, కాదా అనే కొంచెం కూడా ఆలోచించరు. గుడ్డిగా ఆ మాటలను ఫాలో అయిపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చివరకు మీరే నష్టపోతారు. ఇది తెలియాలంటే... ఈ కింది కథ చదవాల్సిందే... 

PREV
14
motivation

ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఎలుకల గుంపు, చెట్టు తొర్రలో పిల్లి, చెట్టు పై కొమ్మల్లో పక్షులు నివసించేవి. మూడు వేర్వేరు జాతులకు చెందినవి అయినా.. అవన్నీ మంచి స్నేహితులు. ఒకరికొకరు కొంచెం కూడా హాని చేసుకోవు. పైగా ఒకరికి మరొకరు సహాయం చేసి... కలిసిమెలిసి జీవించేవి.

పిల్లి ఎలుకను తినేది కాదు, పక్షులు పిల్లిని చూసి భయపడేవి కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన స్నేహం వీరిది అంటూ అడవి మొత్తం చర్చించుకునేవారు. ఇవన్నీ కలిసి వంట చేసుకోవడం, కలిసి తింటూ జీవించేవి. పక్షులన్నీ కలిసి..పుల్లలు ఏరుకొని వచ్చేవి, ఎలుకలు గింజలు తెచ్చేవి. పిల్లి వంట చేసేది. ఒక్కొక్కరు ఒక్కో పాత్ర చేసి.. సంతోషంగా జీవించేవి. వారి స్నేహాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ కుళ్లుకునేవి.

అయితే... వీరి స్నేహాన్ని విడగొట్టాలని ఓ నక్క ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవన్నీ కలిసి ఉంటే.. తాను వాటిని తినలేనని.. విడగొట్టి.. వాటిని తినేయాలని ప్లాన్ వేస్తుంది.

24
నక్క కుట్ర

నక్క మొదట పక్షుల దగ్గరకి వెళ్లి మాట్లాడటం మొదలుపెడుతుంది. ‘‘ మీరే ఎక్కువ పని చేస్తున్నారు, మీరు పుల్లలు ఏరితేనే కదా వంట వేసి వాళ్లు వంట చేసేది, మీరు కష్టపడుతుంటే.. ఆ పిల్లి, ఎలుకలు హాయిగా తింటున్నాయి’’ అని అంటుంది. మొదట ఆ మాటలను పక్షులు పెద్దగా పట్టించుకోవు. కానీ.. నక్క పదే పదే ఆ విషయం చెబుతూనే ఉంటుంది. వినగా వినగా పక్షులకు కూడా అదే నిజం అనిపిస్తుంది. తాము ఒక్కరమే కష్టపడుతున్నాం అని అనుకుంటాయి. వెంటనే ఓ రోజు పిల్లి, ఎలుకల దగ్గరకు వెళ్లి.. తాము పుల్లలు ఏరమని.. వంట చేస్తామని చెబుతాయి. ఎలుకలు కూడా తమకు గింజలు ఏరి బోర్ కొట్టిందని.. పుల్లలు తాము తెస్తామని చెబుతాయి. అందరూ సరే అనుకుంటారు.

34
స్నేహితుల మధ్య దూరం..

మరుసటి రోజు... గింజలు ఎరడానికి వెళ్లిన పిల్లిని.. ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకొని నక్క తినేస్తుంది. ఇక వంట చేస్తూ.. పక్షులు తమ రెక్కలను కాల్చుకుంటాయి. మరోవైపు పుల్లలు ఏరడానికి వెళ్లిన ఎలుకలు దారి తప్పి.. వేరే జంతువుల బారిన పడతాయి. ఇలా.. నక్క మాటలు విని.. వారి స్నేహం చెడిపోవడమే కాకుండా.. జీవితాలనే పోగొట్టుకున్నాయి. ఒక్క చెడు మాట వారి స్నేహాన్ని దూరం చేసింది. నక్క మాత్రం తాను చేసిన కుట్రలో విజయం సాధించినందుకు చాలా సంతోషించింది.

44
కథలోని సారాంశం ఏమిటంటే....

 చెడు మాటలు చిన్నవిగా కనిపించినా... వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెడు మాటలు స్నేహాలను విరగగొడతాయి, కుటుంబాలను విడదీస్తాయి, మనశ్శాంతి కోల్పోయేలా చేస్తుంది. మందర మాటలు విన్న కైకేయి రాముడిని అడవికి పంపింది. శకుని మాటలు విన్న దుర్యోధనుడు తన రాజ్యాన్ని, తన సోదరులకు కోల్పోయాడు. ఈ చెడు మాటలు వినేటప్పుడు.. మనకు మంచి చేయడానికే చెబుతున్నారు అనిపిస్తుంది. కానీ.. చివరకు మనకే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎవరైనా మలన్ని మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో విడదీయడానికి, చెడు చెప్పడానికి ప్రయత్నిస్తే — వెంటనే ఆగి ఆలోచించాలి.స్నేహం, విశ్వాసం, ఐకమత్యం కాపాడుకోవడమే నిజమైన బలం.

Read more Photos on
click me!

Recommended Stories