ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు దాడులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హర్ముజ్ జలమార్గం వద్ద ఆందోళనకర పరిస్థితులు, యుద్ద వాతావరణం కారణంగా ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండియాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది... వీటి ధరలు కూడా రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి.
ఈ ఇంధన సమస్యలు, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలు పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలని... అనవసరంగా వాడవద్దని ప్రజలను కోరారు. ఈ మాటలే ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ అంటు జరుగుతున్న ప్రచారానికి కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్ సమస్య లేకుండా ప్రజలు ఎలక్ట్రిక్ సైకిళ్లు వాడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది... అందుకే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని ఉచితంగా పంపిణీ చేయనుందని ప్రచారం మొదలయ్యింది.
ప్రధాని మోదీ ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ ప్రకటన చేసినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన రూపొందించిన వీడియోను చూసి చాలామంది నిజమేనని నమ్ముతున్నారు. అందుకే PIB స్పందించి ఇది తప్పుడు ప్రచారం అని వివరణ ఇచ్చింది. ఇలాంటి స్కీమ్ ఏదీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయడంలేదని తెలిపింది. ఇలాంటి ప్రచారాలు నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచించింది.