Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది

Published : Jul 29, 2026, 03:33 PM IST

ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలో యువినా పార్థవి పోషిస్తున్న సంపూర్ణ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ కొత్త క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల చేశారు. యువినా అసలు ఎవరో తెలుసా ? ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
Yuvina Parthavi

ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే 47) సినిమా ప్రమోషన్లు కామెడీ ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెంకీ, శ్రీనిధి శెట్టి పోషిస్తున్న పాత్రలను పరిచయం చేసిన చిత్రబృందం, తాజాగా మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో యువినా పార్థవి పోషిస్తున్న సంపూర్ణ పాత్రను పరిచయం చేశారు. వినోదభరితంగా రూపొందించిన ఈ గ్లింప్స్ సినిమా కుటుంబ నేపథ్యం, పాత్రల మధ్య ఉండే ఆసక్తికరమైన సంబంధాలను తెలియజేస్తోంది.

25
వెంకీ కూతురిగా నవ్వులు పూయిస్తున్న యువినా

ఈ ప్రమోషనల్ వీడియో వెంకీ, రఘుబాబు కలిసి ఓ ఇంటి గురించి చర్చించడంతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సంపూర్ణ అక్కడికి వచ్చి తాను మరోసారి ప్రేమలో పడ్డాననే ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. అప్పటికే ఏదో జరగబోతోందని ఊహించిన వెంకీ, ఈసారి ప్రేమలో పడింది కారు మెకానిక్ తోనా అని అడుగుతాడు. అందుకు సంపూర్ణ అవునని చెప్పడంతో అతడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ప్రేమ గురించి ఆమె చెప్పే అతిశయోక్తితో కూడిన డైలాగ్‌తో తండ్రి పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. చివర్లో వచ్చే ఆసక్తికరమైన టైటిల్ కార్డ్ ఆ కుటుంబం ఆలోచనా విధానాన్ని చమత్కారంగా తెలియజేస్తుంది.

35
అంచనాలు పెంచుతున్న గ్లింప్స్ లు

సాధారణ క్యారెక్టర్ పరిచయంలా కాకుండా, ఈ గ్లింప్స్ సినిమా కుటుంబంలోని విభిన్నమైన వ్యక్తిత్వాలను, ప్రతి ఒక్కరి వల్ల ఏర్పడే గందరగోళాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి క్యారెక్టర్ గ్లింప్స్, అంతకుముందు పరిచయం చేసిన పాత్రలకు కొనసాగింపుగా ఉండటంతో సినిమా ఏ తరహా వినోదాన్ని అందించబోతోందనే విషయంపై ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా సంఘటనలతో ఈ సినిమా సంపూర్ణమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.

45
నటీనటులు

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

55
ఇంతకీ యువినా ఎవరో తెలుసా ?

వెంకటేష్ కూతురిగా నటిస్తున్న యువినా పార్థవి గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఆమె తెలుగు కుటుంబంలో చెన్నైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఏవిఎం ప్రొడక్షన్స్ వారి 'ఉరవుక్కు కై కోడుప్పం' టీవీ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఈ సీరియల్ డైరెక్టర్ భువనేశ్.. యువినా తన తండ్రితో ఓ టూర్ లో ఉండగా చూసి ఎంపిక చేశారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. తలా అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ వీరమ్.. యువినాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నాజర్ మనవరాలిగా నటించింది. అజిత్, యువినా మధ్య సీన్లు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ కూతురిగా ఛాన్స్ కొట్టేసింది.

Read more Photos on
click me!

Recommended Stories