బయటపడుతున్న యష్మి అసలు రూపం, మణికంఠ హగ్‌ని తట్టుకోలేక బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు

First Published Sep 17, 2024, 1:52 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో మొదటి రెండు వారాల్లో సోనియా రచ్చ చేస్తే, ఇప్పుడు యష్మి గౌడ అసలు రూపం బయటకు వస్తుంది. మణికంఠ విషయంలో ఆమె బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకోవడం షాకిస్తుంది. 

తెలుగు సీరియల్స్ తో పాపులర్‌ అయిన కన్నడ నటి యష్మికి, నాగ మణికంఠకి మధ్య వివాదం మరింత పెరుగుతుంది. అది కాస్త వ్యక్తిగతంగా టర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా నామినేషన్‌ ప్రక్రియ అయిపోయాక మణికంఠ, యష్మిల మధ్య చోటు చేసుకున్నసంఘటన ఇప్పుడు కొత్త పలుపులకు దారితీస్తుంది. అంతేకాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. యష్మి రియాక్ట్ అవుతున్న తీరు షాకింగ్‌గా ఉంది. తన వల్ల కావడం లేదంటూ బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకోవడం షాకిస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మూడో వారం నామినేషన్‌ ముగిసింది. ఈ వారం యష్మి, మణికంఠ, అభయ్‌, పృథ్వీరాజ్‌, కిర్రాక్‌ సీత, నైనిక, విష్ణు ప్రియా, ప్రేరణ నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌ ప్రక్రియలో యష్మి, మణికంఠ మధ్య గట్టిగా గొడవ జరిగింది. యష్మి తప్పులను ఎత్తిచూపించినందుకు తట్టుకోలేకపోయింది.

మణికంఠపై పగ పట్టింది. తాను హౌజ్‌ లో ఉన్నంత కాలం అతన్ని నామినేట్‌ చేస్తానని వెల్లడించింది. యష్మి ఇంత కాలం నామినేషన్‌లో లేదు. చీఫ్‌ అయిన కారణంగా ఆమె దూరంగా ఉంటూ వచ్చింది. పైగా నామినేట్‌ చేసే విషయంలోనూ ఆమె పెద్దగా వాగ్వాదానికి దిగింది లేదు. దీంతో పెద్దగా ఎలివేట్‌ కాలేదు. 
 

Latest Videos


కానీ తన కన్నింగ్‌ గేమ్‌తో మొన్ననే దొరికిపోయింది. నాగ్‌ ముందే బుక్కయ్యింది. దీంతో వెంటనే ట్రాక్‌ మార్చి కన్నీళ్లు పెట్టుకుంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ నెటిజన్లు ఆమె అసలు నైజాన్ని కనిపెట్టేశారు. ఆమె మహానటి చేష్టలను బయట పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె తన అసలు రూపాన్ని చూపించింది.

నామినేషన్‌ విషయంలో మణికంఠపై ఆమె రియాక్ట్ అయిన విధానం, నోరు జారి బూతు పదాలు వాడిన విధానం చూస్తే అంతా ఆశ్చర్యపోతున్నారు. యష్మిలో ఇలాంటి యాంగిల్‌ ఉందా నోరెళ్లబెట్టుకుంటున్నారు. ఆమె ఫైర్‌ అయితే పక్కోడు తట్టుకోలేరు అనేట్టుగా ఆమె రియాక్షన్స్ ఉండటం గమనార్హం. 
 

ఇక సోమవారం నామినేషన్‌ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోదాం, వదిలేయండి అని చెప్పే ప్రయత్నం చేశాడు మణికంఠ. ఈ క్రమంలో అతను ఆమె బెడ్‌ వద్దకు వచ్చి వెనకాల నుంచి హగ్‌ చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. దానికి ఆ సరే వదిలేయ్‌ అంటూ చిరాకు పడుతూ తెలిపింది యష్మి.

అతను వెళ్లిపోయాక చాలా హైరానా పడిపోయింది. తాను తట్టుకోలేకపోతున్నా అంటూ బిగ్‌ బాస్‌ ముందు వెళ్లడించింది. `బిగ్‌ బిగ్‌ బాస్‌ ఇది టూ మచ్‌, నా వల్ల అవడం లేదు. నాకు కోపం వస్తుంది చాలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒంటరిగా బెడ్‌ పై పడుకుని ఏడ్చేసింది. 
 

ఆ తర్వాత పృథ్వీ వద్ద కూర్చొని, నిజంగా నాకు పెద్ద టార్చర్‌ అంటూ వెల్లడించింది. వచ్చి హగ్‌ చేస్తే నాకు కంఫర్ట్ గా లేదని తెలిపింది. ఆ విషయం చెప్పినా అలానే చేస్తున్నాడని, అతని ఫీలింగ్‌ అంతా ఫేక్‌ అని చెప్పింది. నేనుంత వరకు ప్రతి నామినేషన్‌లో వాడి పేరు తీస్తా అంటూ మరోసారి తన పగని వెళ్లడించింది. ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. యష్మి తీర పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు.
 

ఇదే సమయంలో ఆమె తాను తెచ్చుకున్న కాఫీని పృథ్వీరాజ్‌కి ఇచ్చింది. ఇద్దరు కలిసి ఒకే కప్‌లో కాఫీ తాగారు. మరి ఇక్కడ(పృథ్వీరాజ్‌) విషయంలో లేని డిస్‌ కంఫర్ట్ మణికంఠ విషయంలో ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇది యష్మి అసలు రూపం అని, చాలా స్వార్ధంతో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. 

click me!