Ennenno Janmala Bandham: గుడిలో అన్యోన్య దాంపత్య పూజ చేయనున్న యష్, వేద.. సంతోషంలో రాజా రాణి?

First Published Jan 10, 2023, 2:20 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో రాజాకి గుండెపోటు రావడంతో రాణి ఏడుస్తూ ఉండగా ఓదారుస్తూ ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ వస్తాడు. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం భయపడకండి అతను బాగానే ఉన్నాడు అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత రాణి బయటికి వెళ్లి ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు రాణి ఏడుస్తూ ఉండగా ఊరుకో అమ్మమ్మ ఏడవకు ధైర్యంగా ఉండు ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తున్నావు అని అంటుంది వేద. ఆయనకి ఏం కాలేదు కాబట్టి నేను ఇలా ఏడుస్తూ ఉన్నాను ఆయనకు ఏదైనా అయితే నేను కూడా ఆయనతో పాటు వెళ్లిపోతాను.

ఆయనతో నాకు 60 ఏళ్ల అనుబంధం ఉంది వేద ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అంటుంది రాణి. ఈ 60 ఏళ్లలో ఎన్నో పూజలు చేశానో వ్రతాలు చేశాను దేవుడికి పొర్లు దండాలు పెట్టాను. దేవుడిని కోరుకున్న ప్రతిసారి నా భర్త ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి అని కోరుకుంటాను అని అంటుంది రాణి. భార్య అయిదో తనమంతా కూడా భర్తతోనే ముడిపడి ఉంటుంది. నాకు ప్రతి ఒక్కటి ఆయననే, ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ నేనంటే ఆయనకు పంచప్రాణాలు మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేము అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది రాణి.

నా జీవితమంతా మీ తాతతోనే మీ తాత లేకపోతే నేను లేను అనడంతో అలా మాట్లాడకు అమ్మమ్మ అని ధైర్యం చెబుతూ ఉంటుంది వేద. మరొకవైపు డాక్టర్ చెక్ చేసి బిపి నార్మల్గానే ఉందని అనడంతో ఏంటి యంగ్ మాన్ ఎప్పుడు సంతోషంగా ఉండే వాడివి ఏం ఆలోచిస్తున్నావు అని అనగా ఏం లేదు అని అంటాడు రాజా. ఇంతలోనే డాక్టర్ ఈ మెడిసిన్స్ ఎవరు కరెక్ట్ సమయానికి ఇచ్చారు అనడంతో నా మనవరాలు వేద ఇచ్చింది తను కూడా ఒక సిటీలో పిల్లల డాక్టర్ అనడంతో చాలా మంచి పని చేశావు అయినా ఈ టాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అనడంతో మా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరూ వయసు ఉన్నవాళ్లే ఎమర్జెన్సీకి ఉంటాయని నా దగ్గర పెట్టుకున్నాను అని అంటుంది వేద.
 

అప్పుడు ఆ డాక్టర్ మీ మనవరాలు ముందు జాగ్రతే నీ ప్రాణాలు కాపాడింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు రాణి వేదని హత్తుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తల్లి నువ్వు నా ప్రాణానివి ఈరోజు నువ్వు నాకు పసుపు కుంకాలు నిలబెట్టావు అని అంటుంది రాణి. అది చూసి యష్, రాజా సంతోష పడుతూ ఉంటారు. నీకు తెలియదు కదా ఆయనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను ఆయనతో పాటే నేను కూడా అనడంతో అలా మాట్లాడకు అని అంటుంది రాణి. అప్పుడు రాజా మా ఇద్దరి రెండు గుండెలు కలిసి కొట్టుకుంటాయి ఆగిపోతాయి అని అంటాడు.
 

అప్పుడు చూసావా మనవడా నా రాణి నా కోసమే ఎంతలా తాపత్రయపడుతుందో, ఎంతలా ఆరాట పడిందో లేకుండా అది లేదు అది లేకుండా నేను లేను అని అంటాడు. వారి ప్రేమను చూసి యష్ వేద సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రాజా భార్యని భర్త సంతోషంగా చూసుకోవాలి అని అనడంతో వారిద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మేము మా పెద్దలను చూసి నేర్చుకున్నాము మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అని అంటుంది రాణి. నీ భార్య నీ నుంచి ఏం ఆశిస్తుందో అన్నది ఎవరో చెప్పరు అది నువ్వేం తెలుసుకోవాలి మనవడా అని అంటాడు. అప్పుడు వేద కన్నీళ్లు పెట్టడంతో యష్ వేదవైపు అలాగే చూస్తూ ఉంటాడు.
 

మీరిద్దరు కూడా మాలాగే ఎంతో అన్యాయంగా ప్రేమగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది మా ఆశ అనడంతో వాళ్ళిద్దరూ మౌనంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పూజారి వచ్చి గుడిలో ధనుర్మాసం మొదలవుతున్నాయి కదా ప్రతి ఏడాది మీ దంపతులు అన్యోన్య వ్రతం చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ కదా అనగా ఈసారి ఆ వ్రతం ఏం చేయలేమేమో ఆనంతో ఆయనకు ఒంట్లో బాగోలేదు అని అంటుంది రాణి. ఒక పని చేద్దాము మీ పుణ్య దంపతులు స్థానంలో ఈ దంపతులతో పూజ చేయుము అనడంతో సరే పంతులుగారు అని అంటుంది రాణి.
 

ఇప్పుడు అమ్మమ్మ మేము వెళ్ళాలి ఎక్కడో ఖుషి ఎదురుచూస్తోంది అనగా దానికి ఎలాగోలా నచ్చచెప్పొచ్చు ఈ పూజ చేసి వెళ్ళండి అని అంటుంది రాణి. ప్రతి ఈ ఏడాది మేమే చేసే వాళ్ళం ఈ ఒక్క ఏడాది మీరు చేయండి అని అంటాడు రాజా. ఈ వ్రతం మీరిద్దరూ చేస్తే మీ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది అని అనడంతో ఏమి చేయలేక సరే అని అంటారు. ఆ తరువాత యష్ వేద పూజ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు నేను ఎలాగో అలా అమ్మమ్మ వాళ్ళని ఒప్పించి ఈ పూజ మేము చేయడం లేదని చెబుతాను. అప్పుడు యష్ సరే అని అంటాడు. ఆ తర్వాత యష్ వేద, రాజా రాణి దగ్గరికి వెళ్లి మీరు పెద్దవాళ్ళు మీకోసం మేము ఏమైనా చేస్తాము మేము ఈ పూజ చేస్తున్నాము అనడంతో వాళ్లు కూడా సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్తారు.

click me!