ఎఫ్డీసీ ఛైర్మెన్ దిల్ రాజు సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో నేడు ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ మీటింగులో హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ పాల్గొన్నారు. అలాగే దర్శకులు.. త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, బలగం వేణు, వంశీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, రవి శంకర్, దామోదర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సుప్రియ, నవీన్ ఎర్నేని సైతం పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం ప్రతినిధులుగా నుంచి సీఎం, భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, డీజీపీ, ప్రిన్సపల్ సెక్రెటరీ రవి గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.