జాన్వీ కపూర్‌ తరచూ తిరుమల శ్రీవారిని ఎందుకు దర్శించుకుంటుందో తెలుసా? ఇంత పెద్ద కథ ఉందా?

First Published Aug 13, 2024, 1:14 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి.. కూతురు జాన్వీ కపూర్‌ తరచూ తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. దాని వెనుకాల బలమైన కారణం ఉందట. 
 

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ సౌత్‌లో పాగా వేసేందుకు ప్లాన్‌ చేస్తుంది. అమ్మ శ్రీదేవి లాగానే ఆమె కూడా తెలుగుతోపాటు దక్షిణాదిలో హీరోయిన్‌గా సినిమాలు చేసి ఆ స్థాయిలో గుర్తింపుని, పాపులారిటీని సొంతం చేసుకోవాలని చూస్తుంది. తండ్రి బోనీ కపూర్‌ కోరిక కూడా అదే. అందుకే ఇప్పుడు సౌత్‌పై ఫోకస్‌ చేసింది జాన్వీ.  
 

janhvi kapoor

ఎన్టీఆర్‌ సినిమాతో ఆమె సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తారక్‌ తో ఆమె `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతుంది. మరోవైపు రామ్‌ చరణ్‌తో కలిసి `ఆర్‌సీ16`లో నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రెండూ పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. ఇలా పాన్‌ ఇండియా సినిమాలతో పాన్‌ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని చూస్తుంది జాన్వీ కపూర్‌. వీటితోపాటు తమిళంలోనూ ఆమెకి పలు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. 

Latest Videos


ఇదిలా ఉంటే తరచూ జాన్వీ కపూర్‌ తిరుమలని విజిట్‌ చేస్తుంటుంది. ఎక్కువగా శ్రీవారిని దర్శనం చేసుకుంటూ కనిపిస్తుంటుంది. ఏడాదికి ఐదారుసార్లు ఆమె తిరుమలలోనే కనిపిస్తుంటుంది. అవకాశం దొరికితే ఆమె తిరుపతి వెళ్లిపోతుంది. ఏడుకొండలవాడిని దర్శనం చేసుకుంటూ కనిపిస్తుంటుంది. అయితే జాన్వీ అలా తరచూ తిరుమలకి వెళ్లడానికి బలమైన కారణం ఉందట. ఆ రహస్యం బయటకు వచ్చింది. 
 

అతిలోక సుందరి శ్రీదేవికి ఇష్టదైవ తిరుమల శ్రీవారు. ఆమె కూడా ఎప్పుడూ శ్రీవారిని దర్శించుకునేది. అప్పట్లో శ్రీదేవి హిందీలో కంటే సౌత్‌లోనే ఎక్కువగా బిజీగా ఉండేది. తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. దీంతో షూటింగ్‌ల సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకుని కోరికలు కోరుకోవాడం, ఆ మొక్కులు తీర్చుకునేదట. అలా శ్రీదేవికి తిరుమల వెంకటేశ్వరస్వామి ఫేవరేట్‌ గాడ్‌గా మారాడు. శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే అవుతుందనేది శ్రీదేవి నమ్మకం. అదే నమ్మకాన్ని కంటిన్యూ చేస్తుంది కూతురు జాన్వీ కపూర్‌. 
 

శ్రీదేవి సౌత్‌లో తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఎదగడంలో శ్రీవారి అండ ఎంతో ఉందని ఆమె నమ్ముతుందట. అమ్మకోరిక మేరకు, అమ్మలా తాను ఇక్కడ ఫేమస్‌ అవ్వాలని, అదే సమయంలో అమ్మ కోరిక నెరవేరాలని, ఆమె ఆత్మ హ్యాపీ అవ్వాలని అమ్మపై ప్రేమతో, ఆమె కోసం జాన్వీ కపూర్‌ తరచూ తిరుమలని దర్శించుకుంటుందని తెలుస్తుంది. మొత్తంగా జాన్వీ తిరుమల దర్శనం వెనుక ఆమ్మ బలమైన కోరిక ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఇండియన్‌ ఫస్ట్ లేడీ సూపర్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న శ్రీదేవి..తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో అనేక సినిమాలు చేసింది. తిరుగులేని స్టార్‌ గా నిలచింది. అందంలో ఐకానిక్‌గా పేరుతెచ్చుకుంది. అనేక శక్తివంతమైన పాత్రలు చేసింది. గ్లామర్‌ రోల్స్ చేసింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతోనూ అలరించింది. ఆమె 2018లో దుబాయ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. బాత్‌ టబ్‌లో కాలు జారి చనిపోయినా, ఆమె మరణం ఓ మూలన ఇంకా అనుమానాస్పదమే. నేడు శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా జాన్వీ తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది.

click me!