అలాగే జనవరి 1994లో, శీతాకాల సెలవుల్లో, నిమ్రత్ కౌర్ తన కుటుంబంతో కలిసి తన తండ్రిని కలవడానికి కాశ్మీర్ వెళ్ళింది. అయితే, ఆ సందర్భంలో, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మేజర్ భూపేంద్ర సింగ్ను వర్క్ స్పాట్ నుుంచి కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఏడు రోజుల పాటు కస్టడీలో ఉంచిన తర్వాత అతన్ని దారుణంగా హత్య చేశారు.
నిమ్రత్ కౌర్ చెప్పినదాని ప్రకారం, తన తండ్రిని విడుదల చేసినందుకు ప్రతిగా ఉగ్రవాదులు తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్ను ఆమోదించలేకపోయారు. నాన్నగారు చనిపోయే సమయానికి కేవలం 44 సంవత్సరాలు. ఆ వార్త విన్న తర్వాత మేము ఢిల్లీకి తిరిగి వచ్చాము. "నేను అతని మృతదేహాన్ని మొదటిసారి ఢిల్లీలో చూశాను" అని నిమ్రత్ భావోద్వేగంతో గుర్తుచేసుకుంది.