Mahakali: ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో రాధా రమగా పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న శ్రియా రెడ్డి, ప్రస్తుతం మహాకాళి పాన్ ఇండియా ప్రాజెక్ట్లో కాళికా దేవిగా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
మహాకాళిగా రౌద్రరూపం చూపించిన శ్రియా రెడ్డి.. ఈ సలార్ విలన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలుసా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాకాళి సినిమా టీజర్తో నటి శ్రియా రెడ్డి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె మహాకాళి దేవిగా కనిపించిన రౌద్ర రూపం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. టీజర్ చివరిలో అక్షయ్ ఖన్నా పోషించిన శుక్రాచార్యుడి పాత్రకు ఎదురుగా శ్రియా రెడ్డి ప్రత్యక్షమైన సీన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. టీవీ, సినిమా రంగాల్లో బలమైన, పవర్ఫుల్ రోల్స్ చేయడంలో శ్రియా రెడ్డికి మంచి పేరుంది.
25
మహాకాళిగా శ్రియా రెడ్డి సంచలనం
మహాకాళి టీజర్లో నటుడు అక్షయ్ ఖన్నా అసుర గురువు శుక్రాచార్యుడిగా పరిచయం అయ్యారు. 14 లోకాల్లో అసురుల ఉనికి, హక్కుల గురించి ఆయన మాట్లాడతారు. కానీ శ్రియా రెడ్డి మహాకాళిగా ఎంట్రీ ఇవ్వగానే సీన్ మొత్తం మారిపోతుంది. ఒక వైపు మాతృత్వం, మరోవైపు ఉగ్రరూపంతో కూడిన ఆమె ఎక్స్ప్రెషన్ టీజర్లో చిన్న సన్నివేశమే అయినా గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ మైథలాజికల్ థ్రిల్లర్లో శ్రియా రెడ్డి, అక్షయ్ ఖన్నా మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
35
ఇండియన్ క్రికెట్ టీమ్ కనెక్షన్
శ్రియా రెడ్డి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కోణం ఆమె క్రికెట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. 1982 నవంబర్ 28న జన్మించిన శ్రియా రెడ్డి, భారత మాజీ టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి 1978 నుండి 1981 వరకు భారత జాతీయ జట్టుకు వికెట్ కీపర్గా ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మైంట్ తర్వాత ఆయన కోచింగ్ వైపు వెళ్లి, క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రారంభ రోజుల్లో శిక్షణ కూడా ఇచ్చారు. అలా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాతావరణంలో పెరిగిన శ్రియా, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సలార్తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 - సీజ్ఫైర్ మూవీలో శ్రియా రెడ్డి నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ చెల్లెలు రాధా రమా మన్నార్ పాత్రలో ఆమె నటించింది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఉన్న సీన్లలో కూడా ఆమె తన రాయల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె క్యారెక్టర్ డెప్త్ చూసి బాహుబలిలోని శివగామి పాత్రతో పోల్చారు. సలార్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి శ్రియా రెడ్డికి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
యాక్టింగ్ వైపు రాకముందు శ్రియా రెడ్డి రేడియో జాకీగా , వీడియో జాకీగా పనిచేసింది. తన వాయిస్, ఆన్స్క్రీన్ కాన్ఫిడెన్స్తో టీవీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రియా, చెన్నైలోని గుడ్ షెపర్డ్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఇతిరాజ్ కాలేజీలో ఉన్నత చదువులు చదివింది. ఆర్జే, విజే స్థాయి నుంచి ప్రధాన చిత్రాల్లో ఇంపాక్ట్ ఇచ్చే పాత్రల వరకు ఆమె ప్రయాణం చాలా నిలకడగా సాగింది.
55
తమిళ స్టార్ ఫ్యామిలీతో కోడలిగా బంధం
2002లో విక్రమ్ కథానాయకుడిగా వచ్చిన సమురాయ్ చిత్రంతో శ్రియా సినీ అరంగేట్రం చేసింది. 2003లో అప్పుడప్పుడు సినిమాలో హీరోయిన్గా నటించినా ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే నిరాశపడకుండా వెయిల్, కంచివరం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.
పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2008లో నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణను ఆమె వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ తమిళ ప్రముఖ నటుడు విశాల్ అన్నయ్య. దీంతో శ్రియా రెడ్డి సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ సినీ కుటుంబంతో భాగమైంది. అప్పుడు సలార్, ఇప్పుడు మహాకాళి వంటి పవర్ఫుల్ రోల్స్తో తన స్క్రీన్ ప్రెజెన్స్తో దుమ్మురేపుతోంది.