మహేష్ సిస్టర్ విషయంలో బాలయ్య పై కృష్ణ ఫ్యాన్స్ ఫైర్... 1994లో ఏం జరిగింది?

First Published Mar 26, 2024, 11:17 AM IST

స్టార్ హీరోల వారసులు నటులు ఎంట్రీ ఇవ్వడం కామన్. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల విషయంలో బాలకృష్ణ మూవీ కారణంగా పెద్ద రచ్చ జరిగింది. ఆ వివాదం ఏమిటో చూద్దాం.. 
 

Star heroes

రంగం ఏదైనా వారసత్వం వెరీ కామన్. రాజకీయాలు, సినిమాల్లో దీని ప్రభావం మరింతగా ఉంటుంది. జనాలు వారసత్వాన్ని కోరుకుంటారు. పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ కావాలని, హీరో కొడుకు హీరో కావాలని గట్టిగా నమ్ముతారు. అది ఒక బలమైన సెంటిమెంట్ గా ఉంది. 

Star heroes

అమ్మాయి విషయంలో ఈ సమీకరణాలు మారిపోతాయి. హీరో కొడుకు హీరో కావొచ్చు కానీ... కూతురు హీరోయిన్ కాకూడదు. చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ మీద ఉన్న తక్కువ భావనే ఇందుకు కారణం. బాలీవుడ్ ఆడియన్స్ ఈ విషయంలో బాగా మెచ్యూర్డ్. తెలుగు హీరోల ఫ్యాన్స్ మాత్రం అసలు ఒప్పుకోరు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Manjula Ghattamaneni


హీరోయిన్స్ గా స్టార్ కిడ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్లకు కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. కాగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా హీరోయిన్ కావాలని అనుకున్నారట. ఆమె నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసిందట. 
 

Balakrishna

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 90లలో స్టార్ డైరెక్టర్ గా హవా సాగించాడు. ఆలీ, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతిబాబు వంటి టైర్ టు హీరోలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు ఆయన. ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. బాలయ్యతో మాత్రం ఒక్క సినిమా చేశాడు. 
 

Balakrishna

టాప్ హీరో టైటిల్ తో 1994లో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీలో బాలకృష్ణకు జంటగా మంజుల ఘట్టమనేని ని తీసుకోవాలి అనుకున్నారట. కృష్ణ కూడా పచ్చ జెండా ఊపడంతో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఈ విషయం తెలిసిన కృష్ణ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారట. నిరసనలు మొదలుపెట్టారట. 
 

Balakrishna

బాలకృష్ణతో మంజుల నటించడానికి వీల్లేదని అభిమానులు పంతం పట్టారట. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చాలా కాలంగా రైవల్రి కొనసాగుతుండగా బాలయ్యతో కృష్ణ వారసురాలు నటించడం వాళ్లకు ఆగ్రహం తెప్పించిందట. కృష్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు ఒప్పుకోలేదట. దాంతో మంజులను హీరోయిన్ గా లాంచ్ చేసే ఆలోచన వదులుకున్నాడట. 
 

రాజకీయంగా కూడా కృష్ణ-ఎన్టీఆర్ మధ్య వివాదాలు నడిచాయి. సీఎం అయిన ఎన్టీఆర్ ని దుయ్యబడుతూ కృష్ణ కొన్ని చిత్రాలు చేయడం జరిగింది. ఇదొక కారణం కాగా, కృష్ణ గారి అమ్మాయి హీరోయిన్ కావడం ఫ్యాన్స్ కి నచ్చలేదట. ఈ విషయంలో బాలయ్య మీద కూడా కృష్ణ ఫ్యాన్స్ మండిపడ్డారట.

Manjula Ghattamaneni

మొత్తంగా పంతం నెగ్గించుకున్న కృష్ణ ఫ్యాన్స్ మంజుల హీరోయిన్ కాకుండా ఆపారు. అయితే మంజుల 'షో' అనే ప్రయోగాత్మక చిత్రంలో పెర్ఫార్మన్స్ ఓరియెంట్ రోల్ చేసింది. కేవలం రెండు పాత్రలు మాత్రమే ఉండే ఈ సినిమాకు నీలకంఠ దర్శకుడు. అనంతరం మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా చిత్రాలు చేశారు. 
 

click me!