దివంగత శ్రీదేవి తనయగా జాన్వీ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం ఉన్నప్పటికీ... నటిగా మాత్రం త్వరలోనే పరిచయం కాబోతోంది. దీంతో ఈ సినిమాలో స్టార్ కిడ్ ఏ మేరకు పెర్ఫామ్ చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మూవీ రెండు పార్టులు తీసుకురాబోతున్నామని ఇప్పటికే అధికారికంగానూ ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ద్విపాత్రాభినయం చేయబోతున్నారంట.
ఇందుకోసం సినిమాలో జాన్వీ కపూర్ నే కాకుండా మరో హీరోయిన్ కూడా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎన్టీఆర్ భార్యగా నటిస్తుందని అంటున్నారు. అయితే మరెవరో కాదు నటి శృతి మరాఠినే (Shruti Marathe).
ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్నేకర్ భార్య శృతి మరాఠి ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వైఫ్ రోల్ లో నటించబోతోందని ప్రచారం. ఎన్టీఆర్ కు భార్యగా కనిపించనుందంటే మరీ జాన్వీ కపూర్ ను ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో జాన్వీ కపూర్, శృతి మరాఠి మధ్య పోటీ నెలకొన్నట్లైంది. అసలే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న జాన్వీకి ఇదొక షాకింగ్ న్యూస్ అనే అంటున్నారు.
గతంలో ‘వీరసింహారెడ్డి’లో శృతి హాసన్ కంటే హనీరోజ్ ఎంతలా క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుద్దా అని ఊహిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.