అక్కడ అంతా చెత్త వేస్తున్నారట. అది ఓ డంపింగ్ యార్డ్ అట. ఆ స్థలం చూసి ఈయనకేమైనా పిచ్చా... డంపింగ్ యార్డ్ కొనమంటాడేంది, అనుకుందట. ఇలాంటి స్థలం ఎలా కొనమంటారండి.. అని జయసుధ అన్నారట. కొన్నాళ్లలో ఇదంతా లెవెల్ చేసి కమర్షియల్ ఏరియా చేస్తారు. కాబట్టి ఇక్కడ స్థలం కొను, అని శోభన్ బాబు అన్నారట.
కానీ జయసుధ వినలేదట. ఆ స్థలం ఆమె కొనలేదట. కట్ చేస్తే... అది చెన్నై లోని అన్నా నగర్. అక్కడ ఇప్పుడు ఎకరం వంద కోట్లు ఉంది. శోభన్ బాబు చెప్పినట్లు కనీసం రెండు మూడు ఎకరాల స్థలం కొనుకున్నా జయసుధ వందల కోట్ల ఆస్తిపరురాలు అయ్యేది. ఈ విషయం ఓ కార్యక్రమంలో చెప్పి ఆమె వాపోయింది. ఆయన మాట వినకపోవడం వలన భారీగా నష్టపోయానని చెప్పింది.