నరాల వీక్ నెస్ పోవడానికి రోజూ రెండు పెగ్గులు... మురళీమోహన్ కి ఏఎన్ఆర్ సలహాలు వింటే మైండ్ బ్లాకే!

First Published Jun 24, 2021, 2:08 PM IST


నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. నటుడిగా, నిర్మాతగా దశాబ్దాలు ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్నారు. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరున్న మురళీ మోహన్ పై అనేక రాజకీయ ఆరోపణలు రావడం జరిగింది. 
 

చంద్రబాబు అవినీతి సొమ్ముకు మురళీమోహన్ బినామీ అని ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నాయి. ఇలాంటి అనేక ఆరోపణలు, తన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన మురళీమోహన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
undefined
ఎంపీగా ఉన్న రోజుల్లో అక్రమంగా ఇసుక అమ్ముకొని కోట్లు గడించానని ఆరోపణలు చేశారు. 'నా కొడక్కల్లారా చివరికి నా ఇంటికి అవసరమైన ఇసుకను కూడా మార్కెట్ లో కొన్నాను' అని సమాధానం చెప్పానని మురళీమోహన్ ఫైర్ అయ్యారు.
undefined
ఇక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూనే మందు, లవ్ అఫైర్స్, చిన్నిల్లు, పేకాట వంటి వ్యసనాల జోలికి పోకూడదు అని మురళి మోహన్ డిసైడ్ అయ్యారట.
undefined
ఓ సందర్భంలో అక్కినేని నాగేశ్వరావు ఇంటికి వెళ్లారట మురళీమోహన్. ఆయన రాత్రి పూట నువ్వు ఏం తీసుకుంటావ్ అన్నారట... నేను ఏమీ తీసుకోనండి, నాకు మందు అలవాటు లేదు, అని మురళీమోహన్ సమాధానం చెప్పారట.
undefined
అవునా.. నీకు నిద్ర ఎలా పడుతుందని నాగేశ్వరరావు గారు అనుమానంగా అడిగారట. లేదండి పడుకోగానే నిద్రపోతాను. ఏ సమస్య ఉండదు అని మురళీమోహన్ అన్నారట.
undefined
మురళీమోహన్ సమాధానం వినిన నాగేశ్వరరావు గారు.. లేదయ్యా అరవైయేళ్లు దాటాక నడుము మెత్తబడుతుంది. నరాల వీక్ నెస్ పోయి, వాటిలో ఉత్తేజం తేవడానికి రోజూ రెండు పెగ్గులు తీసుకోవాలి.. అది కూడా మంచి ఫారిన్ బ్రాండ్ వాడాలి అన్నారట.
undefined
ఇక చంద్రబాబు బలవంతంతో రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన ఆయన, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విలువైన 18ఎకరాలు భూమి ఔటర్ రింగ్ రోడ్ కారణంగా పోగొట్టుకున్నాను అన్నారు.
undefined
చాలా మంది ఆయనను కలవమన్నారు. ఒకవేళ పార్టీలో చేరమంటే నా దగ్గర సమాధానం ఉండదు. అందుకే కలవలేదు అని మురళీమోహన్ తెలిపారు.
undefined
click me!