రీల్ ధోని మృతిపై రియల్ ధోని ఎందుకు స్పందించలేదు..?

First Published Jun 15, 2020, 2:12 PM IST

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణంతో యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖలుతో పాటు క్రీడా, రాజకీయా ప్రముఖలు కూడా సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. అయితే ధోని బయోపిక్‌తో పాపులర్‌ అయిన నటుడి మరణంపై రియల్‌ ధోని మాత్రం స్పందించలేదు.

సుశాంత్ మరణం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర స్థాయిలో కలచి వేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంతో ఆయన మృతి అందరినీ షాక్‌కు గురించేసింది. అదే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు, క్రీడా కారులు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాక్ష్యాత్తు దేశ ప్రధాని కూడా ఆయనకు నివాళులర్పించారు.
undefined
అయితే ఎంఎష్ ధోని బయోపిక్ తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహేంద్ర సింగ్‌ ధోని మాత్రం స్పందించలేదు. ధోని బయోపిక్‌ షూటింగ్ సమయంలో వీరిద్దరు చాలా కాలం కలిసి ప్రయాణం చేశారు. పలు టీవీ కమర్షియల్స్‌లోనూ కలిసి నటించారు. ఇక తన బ్యాటింగ్‌ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌ విషయంలో ధోని దగ్గరుండి సుశాంత్‌ను ట్రైన్‌ చేశాడు.
undefined
2016లో రిలీజ్‌ అయిన ఎంఎష్ ధోని : ది అన్‌ టోల్డ్‌ స్టోరి సినిమాతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నాడు. ఈ సినిమాలో అచ్చం ధోనిని గుర్తు చేస్తూ సుశాంత్ పలికించిన హావా భావాలు, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. అంతేకాదు సినిమా ప్రమోషన్‌ సమయంలో ధోని, సుశాంత్‌ను కలిసి పలు ప్రెస్‌ మీట్‌లలో పాల్గొన్నారు.
undefined
ఆ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని ఫ్యామిలీకి కూడా చేరువయ్యాడన్న ప్రచారం జరిగింది. అంతేకాదు ధోని కూతురితో సుశాంత్ ఆటలాడుకుంటున్న ఫోటోలు కూడా అప్పట్లో వైరల్‌ అయ్యాయి. అయితే ఆ స్థాయిలో సుశాంత్‌తో బంధం ఉన్న ధోని, ఆయన మరణంపై మాత్రం స్పందించకపోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్‌.
undefined
అయితే సుశాంత్ మరణ వార్త విన్న తరువాత అది అబద్ధామని భావించిన ధోని ఆ వార్త చెప్పిన వ్యక్తి మీద కోప్పడ్డాడని ధోని చిత్ర నిర్మాత అరుణ్ పాండే చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోవటం వల్లే ధోని ఇంకా స్పందించలేదిని భావిస్తున్నారు.
undefined
ధోని కొంత కాలంగా సొషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. నెగెటివిటి పెరిగిపోవటం, రిటైర్‌మెంట్‌పై తప్పుడు వార్తలు ప్రచారం అవుతుండటంతో సోషల్‌ మీడియాను పక్కన పెట్టేశాడు ధోని, అందుకే సోషల్ మీడియాలో సుశాంత్‌ మరణంపై స్పందించలేదని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో యాక్టివ్‌ గానే ఉంటున్నా సుశాంత్ మృతిపై స్పందించలేదు.
undefined
సుశాంత్ మరణ వార్త జీర్ణించుకోలేక ధోని మౌనంగా ఉండిపోయారని అంటున్నారు ఫ్యాన్స్‌. మరి కాస్త తేరుకున్న తరువాత అయిన ధోని తన భావాలను వ్యక్తపరుస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.
undefined
click me!