బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన 'వాటర్మెలన్ స్టార్' దివాకర్ను పోలీసులు మధురైలో అరెస్ట్ చేశారు. అసలు ఈ అరెస్ట్కు దారితీసిన కారణాలు ఏంటో ఈ ఫొటో గ్యాలరీలో చూద్దాం.
ఇన్స్టాగ్రామ్ రీల్స్తో 'వాటర్మెలన్ స్టార్'గా ఫేమస్ అయిన దివాకర్ను పోలీసులు మధురైలో అరెస్ట్ చేశారు. చెన్నైలోని చేత్పట్, నజరేత్పేట్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. టిక్టాక్ బ్యాన్ అయ్యాక, దివాకర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాపులర్ అయ్యాడు. నటుడు సూర్య 'గజినీ' సినిమా సీన్లను తన స్టైల్లో రీక్రియేట్ చేయడం, పుచ్చకాయ (Watermelon) వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతనికి 'వాటర్మెలన్ స్టార్' అనే పేరు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు.
24
దివాకర్ చుట్టూ ఎన్నో వివాదాలు
ఫేమస్ అయ్యాక, దివాకర్ చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. గతంలో ఓ ప్రైవేట్ టీవీ యాంకర్, నటుడు, సింగర్ తనను అవమానించి, బెదిరించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే టార్గెట్ చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలోనే, ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, తనను ఓ గదిలో బంధించి కొట్టారని దివాకర్ ఆరోపించాడు. ఈ ఘటనపై తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో పోస్ట్ చేయడంతో పాటు, చెన్నై చేత్పట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు.
34
యూట్యూబ్ ఛానల్ కెమెరాలు ధ్వంసం
తన అనుమతి లేకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి డబ్బు సంపాదించారని, తన పరువును వ్యాపారంగా మార్చారని దివాకర్ ఆరోపించాడు. మరోవైపు, దివాకర్ తమ కెమెరా, లైట్లు వంటి షూటింగ్ వస్తువులని పగలగొట్టాడని సదరు యూట్యూబ్ ఛానెల్ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసుల నేపథ్యంలోనే, మధురై పుదూర్లో ఉన్న దివాకర్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కోసం చెన్నైకి తీసుకొచ్చారు.
అరెస్ట్ కావడానికి ముందు రిలీజ్ చేసిన వీడియోలో దివాకర్ పలు ఆరోపణలు చేశాడు. చట్టవిరుద్ధంగా తనను బంధించి చాలామంది కొట్టారని, ఆధారాలు ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఘటన జరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించి, ఈ కేసును వేరే అధికారి విచారించాలని డిమాండ్ చేశాడు. కొంతమంది పోలీసుల తీరు ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెస్తోందని కూడా విమర్శించాడు. నిజాయితీగా బతికేవాళ్ల కంటే, ఇతరులను అవమానించి డబ్బు సంపాదించే వాళ్లే ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.