నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో వివాదం కూడా అయింది. ముఖ్యంగా కర్ణుడి పాత్రపై విమర్శలు చెలరేగాయి. దీనిపై తాజాగా నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కల్కి 2898 ఎడి చిత్రంతో నాగ్ అశ్విన్ పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. కల్కి చిత్రం 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియాలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కల్కి చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం ఆ పనిలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారు. అయితే కల్కి మొదటి భాగం విషయంలో చెలరేగిన వివాదం ఇప్పటికీ చల్లారలేదు.
25
కల్కి మూవీ వివాదం
కర్ణుడి పాత్రని నాగ్ అశ్విన్ బాగా హైలైట్ చేశారు. కర్ణుడి ముందు అర్జునుడి తక్కువ వాడిగా చూపించే ప్రయత్నం చేశారు. దీనితో చాలా పురాణాలు చదివిన పండితులు, అనంత్ శ్రీరామ్, గరికపాటి లాంటి వారంతా కల్కి చిత్రాన్ని, కర్ణుడి గురించి అందులో చూపించిన విషయాలని తీవ్రంగా తప్పు పట్టారు. అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మహాభారతంలో కర్ణుడిని ఓడించిన ఎందరో వీరులపై అర్జునుడు గెలిచాడు.
35
అనంత్ శ్రీరామ్, గరికపాటి విమర్శలు
ఏ సందర్భంలోనూ అర్జునుడిపై కర్ణుడికి అప్పర్ హ్యాండ్ లేదు. అలాంటప్పుడు దేనిని ప్రామాణికంగా తీసుకుని అర్జునుడికంటే కర్ణుడు గొప్ప వీరుడు అని అంటారు. అంటే మీ ఇష్టమా.. అది తప్పు కదా అంటూ దుమ్మెత్తి పోశారు. గరికపాటి మాట్లాడుతూ.. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. సినిమా వాళ్లు ఏది చెబితే అదే నిజం. అసలు భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అర్జంటుగా కర్ణుడు, అశ్వథామ హీరోలు అయిపోయారు.. కృష్ణుడు, అర్జునుడు విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో తెలియదు, ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది అంటూ గరికపాటి విమర్శించారు.
కల్కి సినిమాపై ఈ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ కల్కి చిత్రంలో కర్ణుడి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ద్రోణ వధ పర్వంలో ఇవి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు. బిబేక్ డెబ్రాయ్ వర్షన్ చదవండి. లేదా గూగుల్ చేయండి. అర్జునుడి వద్ద కృష్ణుడు ఎన్నిసార్లు కర్ణుడిని పొగిడాడో తెలుస్తుంది. మన చరిత్ర పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కల్కి 2 కోసం ఎదురుచూస్తూ ఉండండి' అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి మహాభారతానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా జోడించారు. ఆ స్క్రీన్ షాట్ లో కర్ణుడి గురించి కృష్ణుడు అర్జునుడితో చెబుతున్న మాటలు ఉన్నాయి.
55
క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
'ఘటోత్కచుడిపై ఆ శక్తి ఆయుధం (ఈటె) ఉపయోగించబడింది. ఓ ధనంజయా! కాబట్టి, కర్ణుడు ఇప్పటికే మరణించినట్టుగా భావించు. ఒకవేళ కర్ణుడి చేతిలో ఆ శక్తి ఆయుధమే ఉండి ఉంటే, ఈ ప్రపంచంలో ఏ మానవుడూ అతని ముందు నిలబడగలిగేవాడు కాదు. యుద్ధంలో అతను కార్తికేయుడిలా (కుమారస్వామిలా) అజేయుడిగా నిలిచేవాడు. మన అదృష్టం బాగుండి అతని కవచం పోయింది. మన అదృష్టం కొద్దీ అతని కుండలాలు దహించుకుపోయాయి (గ్రహించబడ్డాయి). మన అదృష్టం బాగుండబట్టే ఆ తిరుగులేని శక్తి ఆయుధం ఘటోత్కచుడిపై ఉపయోగించబడింది. ఒకవేళ అతని వద్ద ఆ కవచం, ఆ కుండలాలు ఉండి ఉంటే, శక్తిమంతుడైన ఆ కర్ణుడు ముల్లోకాలలోని ఎవరినైనా, ఆఖరికి అమరులైన దేవతలను సైతం ఓడించగలిగేవాడు. వాసవుడు (ఇంద్రుడు), కుబేరుడు, జలాధిపతియైన వరుణుడు, యముడు కూడా కర్ణుడితో తలపడటానికి సాహసించేవారు కాదు. పురుష శ్రేష్ఠుడైన అతని వద్ద ఒకవేళ అవే ఉండి ఉంటే, నీ గాండీవంతో నువ్వు కానీ, నా సుదర్శన చక్రంతో నేను కానీ అతనిని యుద్ధంలో ఓడించే సామర్థ్యాన్ని కలిగి ఉండేవాళ్ళం కాదు' అని మహాభారతంలో ఉన్న వాక్యాలని నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. దీని ద్వారా తాను మహాభారతంలో ఉన్నదే చూపిస్తున్నాను అంటూ నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పారు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేక మరింత పెరుగుతుందా అనేది చూడాలి.